యూపీకి రెండో సారి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే లక్నో స్టేడియంలో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తల నడుమ ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు విశేషం. అంతేకాకుండా పలువురు బాలీవుడ్ నటులు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
కాగా, డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. కేశవ్ ప్రసాద్ మౌర్య ఇటీవలి ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ఆయననే డిప్యూటీ సీఎంగా కొనసాగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఇక, ఇవాళ్టి ప్రమాణస్వీకారోత్సవంలో యోగి కాకుండా 52 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ 255 చోట్ల జయభేరి యోగించింది.