PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- పీఎం కిసాన్ 23వ విడత
- రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ
- 2026 జూన్, జూలై మధ్య అందవచ్చని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున సమాన వాయిదాలలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులు ఇప్పటివరకు 22 విడతలు అందుకున్నారు. 22వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 13 అస్సాంలోని గౌహతి నుండి విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుండడంతో రైతులు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ యోజన 23వ విడత ఎప్పుడు వస్తుంది?
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
మార్చిలో 22వ విడత అందిన తర్వాత, పీఎం కిసాన్ యోజన 23వ విడత 2026 జూన్, జూలై మధ్య అందవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పీఎం కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్న తర్వాత, ఇ-కేవైసిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. మీ ఇ-కేవైసి ప్రక్రియ అసంపూర్తిగా ఉండి, మీ ధృవీకరణ పెండింగ్లో ఉన్నట్లు చూపిస్తే, మీ తదుపరి వాయిదా ఆలస్యం కావచ్చు. మీ తదుపరి వాయిదాలో ఆలస్యాన్ని నివారించాలంటే, మీరు తప్పనిసరిగా ఇ-కేవైసిని పూర్తి చేయాలి.
పీఎం కిసాన్ యోజన కోసం ఇ-కేవైసి ఎలా చేయాలి?
ముందుగా, pmkisan.gov.in అనే అధికారిక వెబ్సైట్కు వెళ్లండి.
హోమ్ పేజీలో ‘ఫార్మర్స్ కార్నర్’ పై క్లిక్ చేయండి.
ఇక్కడ ‘ఇ-కెవైసి’ (e-KYC) ఆప్షన్పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత, మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేసి, OTPని సమర్పించండి.
రిజిస్టర్డ్ నంబర్కు వచ్చిన OTPని నమోదు చేసి, ‘సమర్పించు’ (Submit) పై క్లిక్ చేయండి.
ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ స్క్రీన్పై ‘ఇ-కెవైసి విజయవంతమైంది’ (successful e-KYC) అనే సందేశం వస్తుంది.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!