PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- పీఎం కిసాన్ 23వ విడత
- రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ
- 2026 జూన్, జూలై మధ్య అందవచ్చని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున సమాన వాయిదాలలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులు ఇప్పటివరకు 22 విడతలు అందుకున్నారు. 22వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 13 అస్సాంలోని గౌహతి నుండి విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుండడంతో రైతులు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ యోజన 23వ విడత ఎప్పుడు వస్తుంది?
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
మార్చిలో 22వ విడత అందిన తర్వాత, పీఎం కిసాన్ యోజన 23వ విడత 2026 జూన్, జూలై మధ్య అందవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పీఎం కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్న తర్వాత, ఇ-కేవైసిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. మీ ఇ-కేవైసి ప్రక్రియ అసంపూర్తిగా ఉండి, మీ ధృవీకరణ పెండింగ్లో ఉన్నట్లు చూపిస్తే, మీ తదుపరి వాయిదా ఆలస్యం కావచ్చు. మీ తదుపరి వాయిదాలో ఆలస్యాన్ని నివారించాలంటే, మీరు తప్పనిసరిగా ఇ-కేవైసిని పూర్తి చేయాలి.
పీఎం కిసాన్ యోజన కోసం ఇ-కేవైసి ఎలా చేయాలి?
ముందుగా, pmkisan.gov.in అనే అధికారిక వెబ్సైట్కు వెళ్లండి.
హోమ్ పేజీలో ‘ఫార్మర్స్ కార్నర్’ పై క్లిక్ చేయండి.
ఇక్కడ ‘ఇ-కెవైసి’ (e-KYC) ఆప్షన్పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత, మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేసి, OTPని సమర్పించండి.
రిజిస్టర్డ్ నంబర్కు వచ్చిన OTPని నమోదు చేసి, ‘సమర్పించు’ (Submit) పై క్లిక్ చేయండి.
ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ స్క్రీన్పై ‘ఇ-కెవైసి విజయవంతమైంది’ (successful e-KYC) అనే సందేశం వస్తుంది.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!