PM Modi: ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం..
- ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం..
- ‘‘మిత్ర విభూషణ’’ ద్వారా గౌరవించిన ద్వీప దేశం..
- ఇరు దేశాల స్నేహానికి గుర్తుగా అవార్డు ప్రదానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. శ్రీలంక-భారత్ సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో ప్రధాని మోడీ అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శనివారం ద్వీప దేశం ఈ అవార్డును అందించింది. ‘‘మిత్ర విభూషణ’’ పతకం ద్వారా శ్రీలంక మోడీని గౌరవించింది. ఇది స్నేహం, వారసత్వాన్ని సూచిస్తుంది. ప్రధాని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
Read Also: CBI Raids: చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా 18 చోట్ల దాడులు
Also Read
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
‘‘ఇది నాకు గర్వకారణమైన క్షణం. ఇది నాకు మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులకు గౌరవం. ఇది శ్రీలంక, భారతదేశ ప్రజల మధ్య చారిత్రక సంబంధాన్ని, లోతైన స్నేహాన్ని చూపిస్తుంది. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు అధ్యక్షుడు, శ్రీలంక ప్రభుత్వం, ఇక్కడి ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ఆయన అన్నారు.
అనుర కుమార దిస్సానాయకే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటిసారిగా ఆయన భారతదేశానికి వచ్చారని, ఆయన ఎన్నికైన తర్వాత మొదటి అంతర్జాతీయ నాయకుడిగా తాను శ్రీలంకకు వచ్చానని, ఇది మా సంబంధాల లోతును తెలియజేస్తుందని ఆయన అన్నారు. 2019 బాంబు దాడులు, కోవిడ్-19 సమయంలో భారత్ శ్రీలంక కష్టకాలంలో అండగా నిలబడిందని మోడీ అన్నారు. ‘‘మిత్ర విభూషణ’’ పతకం రెండు దేశాల మధ్య సంబంధాల పటిష్టతను తెలియజేస్తుందని చెప్పారు. శ్రీలంక అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోడీకి ఇప్పటి వరకు 22 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!