Tamilnadu: టీనేజ్ బాలికపై వందమంది పైశాచికం.. ఆ కీచకులకు జీవిత ఖైదు, 20 ఏళ్ళ జైలుశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical attack on Tamil Nadu teenage girl.. Accused gets life: ఓ టీనేజ్ బాలికను లైంగికంగా వేధింపులకు పాల్పడటంతో పాటు.. ఆమెను వ్యభిచారంలోకి దింపిన కేసులో తమిళనాడు ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించగా..ఓ పోలీస్ అధికారి, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలతో పాటు 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
జీవిత ఖైదు పడిన వారిలో బాధితురాలి సవతి తండ్రి, సవతి తల్లి ఉన్నారు. సస్పెండ్ అయిన ఎన్నూర పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సీ పుగలేంది, బీజేపీ కార్యకర్త జీ రాజేంద్రన్, ఓ ప్రైవేటు మీడియా ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టు వినోబాజీకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. మొత్తం 26 మంది నిందితుల్లో నలుగురు ఇప్పటికే పారిపోగా.. కేసు విచారణలో ఉన్న సమయంలో ఒకరు మరణించారు. మిగిలిన 21 మందిని విచారించింది కోర్టు. తాజాగా శిక్షలను ఖరారు చేసింది.
Also Read
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
Read Also: Supreme Court: ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. శివసేనపై ఈసీదే తుది నిర్ణయం
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 26 మందిపై వాషర్మెన్పేటలోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దాదాపుగా 560 పేజీల చార్జిషీట్ ఫైల్ చేశారు. 2020లో కోర్టుకు సమర్పించారు. నేరం జరిగే సమయానికి 13 ఏళ్ల వయస్సు ఉన్న బాలికపై 100 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్స్పెక్టర్, రాజకీయ నాయకుడు, జర్నలిస్టు ఆమెను వ్యభిచారంలోకి నెట్టేయడంతో ఈ కేసు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సెప్టెంబర్ 15న పోక్సో చట్టం కింద కేసులను పరిష్కరించేందుకు ఏర్పడిన ప్రత్యేక న్యాయస్థానం మొత్తం 21 మంది నేరస్తులను దోషులుగా ప్రకటించింది. సోమవారం వీరందరికి శిక్షలను ఖరారు చేసింది. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 21 మందిపై విధించిన జరిమానా రూ.2 లక్షలను బాధితురాలికి అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..