Tamilnadu: టీనేజ్ బాలికపై వందమంది పైశాచికం.. ఆ కీచకులకు జీవిత ఖైదు, 20 ఏళ్ళ జైలుశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical attack on Tamil Nadu teenage girl.. Accused gets life: ఓ టీనేజ్ బాలికను లైంగికంగా వేధింపులకు పాల్పడటంతో పాటు.. ఆమెను వ్యభిచారంలోకి దింపిన కేసులో తమిళనాడు ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించగా..ఓ పోలీస్ అధికారి, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలతో పాటు 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
జీవిత ఖైదు పడిన వారిలో బాధితురాలి సవతి తండ్రి, సవతి తల్లి ఉన్నారు. సస్పెండ్ అయిన ఎన్నూర పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సీ పుగలేంది, బీజేపీ కార్యకర్త జీ రాజేంద్రన్, ఓ ప్రైవేటు మీడియా ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టు వినోబాజీకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. మొత్తం 26 మంది నిందితుల్లో నలుగురు ఇప్పటికే పారిపోగా.. కేసు విచారణలో ఉన్న సమయంలో ఒకరు మరణించారు. మిగిలిన 21 మందిని విచారించింది కోర్టు. తాజాగా శిక్షలను ఖరారు చేసింది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
Read Also: Supreme Court: ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. శివసేనపై ఈసీదే తుది నిర్ణయం
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 26 మందిపై వాషర్మెన్పేటలోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దాదాపుగా 560 పేజీల చార్జిషీట్ ఫైల్ చేశారు. 2020లో కోర్టుకు సమర్పించారు. నేరం జరిగే సమయానికి 13 ఏళ్ల వయస్సు ఉన్న బాలికపై 100 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్స్పెక్టర్, రాజకీయ నాయకుడు, జర్నలిస్టు ఆమెను వ్యభిచారంలోకి నెట్టేయడంతో ఈ కేసు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సెప్టెంబర్ 15న పోక్సో చట్టం కింద కేసులను పరిష్కరించేందుకు ఏర్పడిన ప్రత్యేక న్యాయస్థానం మొత్తం 21 మంది నేరస్తులను దోషులుగా ప్రకటించింది. సోమవారం వీరందరికి శిక్షలను ఖరారు చేసింది. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 21 మందిపై విధించిన జరిమానా రూ.2 లక్షలను బాధితురాలికి అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
తాజావార్తలు
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?