Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పౌరసత్వం’’ రద్దు చేయాలని పిటిషన్..
- రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు విచారణ..
- సీబీఐ విచారణ డిమాండ్ చేసిన పిటిషన్..
- కేంద్ర స్పందన కోరిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు అలహాబాద్ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. రాహుల్ గాంధీపై సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారించింది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆధారాలు ఉన్నట్లు పిటిషనర్ ఆరోపించారు. గతంలో వీఎస్ఎస్ శర్మ చేసిన విచారణలో యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈమెయిళ్లను ఉదహరించారు.
Read Also: Supreme Court: ‘‘మీరు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లా..?’’ కేఏ పాల్ పిటిషన్పై ఆగ్రహం..
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
రాహుల్ గాంధీ పౌరసత్వంపై సమాచారం కోసం శర్మీ 2022లో యూకే అధికారులను సంప్రదించారు. యూకే ప్రభుత్వం కొన్ని వివరాలను ధృవీకరించినట్లు నివేదించబడినప్పటికీ, డేటా రక్షణ చట్టాలు, రాహుల్ గాంధీ అధికారిక లేఖ లేకపోవడంతో పూర్తి సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించింది. ఈ కేసుపై నవంబర్ 25 డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే, ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాక స్వీకరించినట్లు, దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ లోగా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని జస్టిస్ అట్టౌ రెహమాన్ మసూది, జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం, ఏ వ్యక్తి కూడా భారత పౌరసత్వాన్ని మరియు మరొక దేశం యొక్క పౌరసత్వాన్ని ఏకకాలంలో కలిగి ఉండకూడదు. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ పరిశీలనలో ఉండగా, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కూడా ఇదే పిటిషన్ దాఖలు చేశారు. అలహాబాద్ హైకోర్టు విచారణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కేసును విచారిస్తామని ఢిల్లీ కోర్టు సూచించింది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!