Personal Data Protection Bill: ఇకపై పర్సనల్ డేటా సురక్షితం.. పార్లమెంటులో బిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Personal Data Protection Bill: ఇకపై దేశంలోని ప్రతి పౌరుడి పర్సనల్ డాటా సురక్షితంగా ఉండనుంది. పర్సనల్ డేటాను ఎవరైనా వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేసినట్టయితే అటువంటి వ్యక్తులు, సంస్థలకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు- 2023ని నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశ పౌరుల డిజిటల్ హక్కులను బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు వీలుగా తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు- 2023 (Digital Personal Data Protection Bill 2023)’ లోక్సభ ముందుకొచ్చింది. విపక్షాల ఆందోళనల నడుమ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీన్ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీన్ని ద్రవ్య బిల్లుగా తీసుకొచ్చారన్న విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. సాధారణ బిల్లుగానే ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
Read also: Nabha Natesh: ఒంపుసొంపులన్నీ చూపిస్తూ కవ్విస్తోన్న నభా నటేష్
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (DPDP 2023)లో ముసాయిదా బిల్లుతో పోలిస్తే చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన అనేక నిబంధనలు సడలించారు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం.. ఏదైనా కంపెనీ సమాచార దుర్వినియోగానికి పాల్పడితే.. గరిష్ఠంగా రూ. 250కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా.. సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ.50కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఈ చట్టం అమలు కోసం ‘డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ బోర్డు, దాని సభ్యులు, ఉద్యోగులు, అధికారులపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు ఉండవని బిల్లులో తెలిపారు. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు అనుమతి ఉంటుంది. దీనిపై కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఆన్లైన్ వేదికల్లో వ్యక్తుల సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతోంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!