NTV Telugu Site icon

Shatabdi Express: చాయ్ రూ.20 .. సర్వీస్ చార్జ్ రూ 50.. ఖంగుతిన్న ప్రయాణికుడు

Shatadri Express

Shatadri Express

స‌ర్వీస్ చార్జీలు అంటూనే ప్రతి ఒక్కరికి భ‌యం ప‌ట్టుకొస్తోంది. ఎందుకంటే మ‌నం కొన్న దానికంటే అదే ఎక్కువ‌గా మోత పడుతుంద‌టంతో వినియోగ దారుల‌కు షాక్ గుర‌య్యేలా చేస్తోంది. ఏ వస్తువు కొన్న, ఏ తిన్నా దాని పై స‌ర్వీస్ చార్జీలు అంటూ మోత మోగిస్తూ.. కొన్న‌ది యాభైరూపాల‌దైతే దానిపై స‌ర్వీస్ చార్జ్ అంటూ వంద వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. ఏంటిద‌ని అడిగితే అది మామూలే అంటూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. దీంతో సామాన్యుల‌పై భారంగా మారింది. అయితే మ‌నం తిన్న , తాగిన కూడా దానిపై ప్ర‌యాణించే రైళ్ల‌లో కూడా స‌ర్వీస్ చార్జీలంటూ వ‌సూలు చేయ‌డం పై ప్ర‌యాణికులు మండిప‌డుతున్నారు. టీ తాగితే దానికంటే ఎక్క‌వ‌గా స‌ర్వీస్ చార్జీ రావ‌డంతో ఆప్ర‌యాణికుడు షాక్ కు గుర‌య్యేలా చేసింది. ఈ ఘటన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది.

read also:COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కేసులు..31 మరణాలు

ఓ ప్రయాణికుడికి ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో కప్పు చాయ్ ఆర్ఢర్ ఇచ్చాడు. చాయ్ తాగిన ప్రయాణికుడికి చుక్కలు కనిపించాయి.. ఆ చాయ్‌కి అతడు చెల్లించిన బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే.. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు జూన్ 28న ఇదే రైలులో ప్రయాణించాడు. కాగా.. రైలులో టీ తాగాలనిపించి ఆర్డర్ చేస్తే ఏకంగా రూ. 70 బిల్లు చేతిలో పెట్టారు. అందులో టీకి రూ. 20, సర్వీస్ చార్జ్ రూ. 50గా పేర్కొనడంతో వినోద్ వర్మ ఆశ్చర్యపోయాడు. అయితే వెంటనే ఆ బిల్లును ఫొటో తీసి ట్వీట్ చేసిన ఆయన.. ‘రూ. 20 టీకీ రూ. 50 సర్వీస్ చార్జీనా?.. మరీ ఇంత దోపిడీనా?’ అని వాపోయాడు.

అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. రైలులో టీకి ఐదు రూపాయలే ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. సర్వీస్ చార్జ్ వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల రెస్టారెంట్లకు జారీ చేసిన ఆదేశాల క్లిప్పింగులను మరికొందరు షేర్ చేస్తున్నారు. అయితే..ఈ ట్వీట్ వైరల్ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు ప్రయాణికుడి నుంచి తాము అదనంగా ఎలాంటి మొత్తమూ వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా.. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుందంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రస్తావించారు.