Shatabdi Express: చాయ్ రూ.20 .. సర్వీస్ చార్జ్ రూ 50.. ఖంగుతిన్న ప్రయాణికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్వీస్ చార్జీలు అంటూనే ప్రతి ఒక్కరికి భయం పట్టుకొస్తోంది. ఎందుకంటే మనం కొన్న దానికంటే అదే ఎక్కువగా మోత పడుతుందటంతో వినియోగ దారులకు షాక్ గురయ్యేలా చేస్తోంది. ఏ వస్తువు కొన్న, ఏ తిన్నా దాని పై సర్వీస్ చార్జీలు అంటూ మోత మోగిస్తూ.. కొన్నది యాభైరూపాలదైతే దానిపై సర్వీస్ చార్జ్ అంటూ వంద వరకు వసూలు చేస్తున్నారు. ఏంటిదని అడిగితే అది మామూలే అంటూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. దీంతో సామాన్యులపై భారంగా మారింది. అయితే మనం తిన్న , తాగిన కూడా దానిపై ప్రయాణించే రైళ్లలో కూడా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం పై ప్రయాణికులు మండిపడుతున్నారు. టీ తాగితే దానికంటే ఎక్కవగా సర్వీస్ చార్జీ రావడంతో ఆప్రయాణికుడు షాక్ కు గురయ్యేలా చేసింది. ఈ ఘటన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకుంది.
read also:COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కేసులు..31 మరణాలు
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ఓ ప్రయాణికుడికి ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో కప్పు చాయ్ ఆర్ఢర్ ఇచ్చాడు. చాయ్ తాగిన ప్రయాణికుడికి చుక్కలు కనిపించాయి.. ఆ చాయ్కి అతడు చెల్లించిన బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే.. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు జూన్ 28న ఇదే రైలులో ప్రయాణించాడు. కాగా.. రైలులో టీ తాగాలనిపించి ఆర్డర్ చేస్తే ఏకంగా రూ. 70 బిల్లు చేతిలో పెట్టారు. అందులో టీకి రూ. 20, సర్వీస్ చార్జ్ రూ. 50గా పేర్కొనడంతో వినోద్ వర్మ ఆశ్చర్యపోయాడు. అయితే వెంటనే ఆ బిల్లును ఫొటో తీసి ట్వీట్ చేసిన ఆయన.. ‘రూ. 20 టీకీ రూ. 50 సర్వీస్ చార్జీనా?.. మరీ ఇంత దోపిడీనా?’ అని వాపోయాడు.
అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. రైలులో టీకి ఐదు రూపాయలే ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. సర్వీస్ చార్జ్ వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల రెస్టారెంట్లకు జారీ చేసిన ఆదేశాల క్లిప్పింగులను మరికొందరు షేర్ చేస్తున్నారు. అయితే..ఈ ట్వీట్ వైరల్ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు ప్రయాణికుడి నుంచి తాము అదనంగా ఎలాంటి మొత్తమూ వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా.. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుందంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్ను ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!