Shatabdi Express: చాయ్ రూ.20 .. సర్వీస్ చార్జ్ రూ 50.. ఖంగుతిన్న ప్రయాణికుడు
సర్వీస్ చార్జీలు అంటూనే ప్రతి ఒక్కరికి భయం పట్టుకొస్తోంది. ఎందుకంటే మనం కొన్న దానికంటే అదే ఎక్కువగా మోత పడుతుందటంతో వినియోగ దారులకు షాక్ గురయ్యేలా చేస్తోంది. ఏ వస్తువు కొన్న, ఏ తిన్నా దాని పై సర్వీస్ చార్జీలు అంటూ మోత మోగిస్తూ.. కొన్నది యాభైరూపాలదైతే దానిపై సర్వీస్ చార్జ్ అంటూ వంద వరకు వసూలు చేస్తున్నారు. ఏంటిదని అడిగితే అది మామూలే అంటూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. దీంతో సామాన్యులపై భారంగా మారింది. అయితే మనం తిన్న , తాగిన కూడా దానిపై ప్రయాణించే రైళ్లలో కూడా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం పై ప్రయాణికులు మండిపడుతున్నారు. టీ తాగితే దానికంటే ఎక్కవగా సర్వీస్ చార్జీ రావడంతో ఆప్రయాణికుడు షాక్ కు గురయ్యేలా చేసింది. ఈ ఘటన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకుంది.
read also:COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కేసులు..31 మరణాలు
Also Read
- NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
ఓ ప్రయాణికుడికి ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో కప్పు చాయ్ ఆర్ఢర్ ఇచ్చాడు. చాయ్ తాగిన ప్రయాణికుడికి చుక్కలు కనిపించాయి.. ఆ చాయ్కి అతడు చెల్లించిన బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే.. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు జూన్ 28న ఇదే రైలులో ప్రయాణించాడు. కాగా.. రైలులో టీ తాగాలనిపించి ఆర్డర్ చేస్తే ఏకంగా రూ. 70 బిల్లు చేతిలో పెట్టారు. అందులో టీకి రూ. 20, సర్వీస్ చార్జ్ రూ. 50గా పేర్కొనడంతో వినోద్ వర్మ ఆశ్చర్యపోయాడు. అయితే వెంటనే ఆ బిల్లును ఫొటో తీసి ట్వీట్ చేసిన ఆయన.. ‘రూ. 20 టీకీ రూ. 50 సర్వీస్ చార్జీనా?.. మరీ ఇంత దోపిడీనా?’ అని వాపోయాడు.
అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. రైలులో టీకి ఐదు రూపాయలే ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. సర్వీస్ చార్జ్ వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల రెస్టారెంట్లకు జారీ చేసిన ఆదేశాల క్లిప్పింగులను మరికొందరు షేర్ చేస్తున్నారు. అయితే..ఈ ట్వీట్ వైరల్ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు ప్రయాణికుడి నుంచి తాము అదనంగా ఎలాంటి మొత్తమూ వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా.. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుందంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్ను ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..
-
Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
-
NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!