BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..
- ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి..
- సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం..
- వక్ఫ్ చట్టం విచారణపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారించడం ప్రారంభించింది. ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో చేర్చడం, వక్ఫ్ బై యూజర్ వంటి ఆస్తుల్ని డీనోటిఫై చేయడం వంటి చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు.
తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలోకి ముస్లింయేతరుల నియామకాలు జరగవని కేంద్రం నుంచి సుప్రీంకోర్టుకు హామీ లభించింది. ఇప్పటికే నోటిఫై చేయబడిన లేదా నమోదు చేయబడిన “వక్ఫ్-బై-యూజర్” ఆస్తులతో సహా ఏ వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని, ఈ కాలంలో జిల్లా కలెక్టర్లు వాటి స్థితిని మార్చరని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా కోర్టు రికార్డ్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
Read Also: Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..
ఈ వ్యవహారంపై పలువురు బీజేపీ ఎంపీలు సుప్రీంకోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ చట్టాలు చేయాలనుకుంటే, పార్లమెంట్ ఉనికిలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి అని దూబే ఎక్స్ పోస్టులో పరోక్షంగా సుప్రీంకోర్టు సమీక్షల్ని ప్రస్తావించారు. ఈ చట్టంపై కేంద్రం తన ప్రతిస్పందన తెలియజేయడానికి ఒక వారం సమయం ఇచ్చింది. తదుపరి విచారణ మే 5న జరగనుంది.
1995 వక్ఫ్ చట్టానికి 2025 సవరణల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ, ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ , కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం గురువారం వరుసగా రెండవ రోజు కూడా పిటిషన్లను విచారించింది. బుధవారం జరిగిన విచారణలో వక్ఫ్ చట్టంలోని అనేక నిబంధనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని నిబంధనలు రాజ్యాంగ పరిశీలనలో ఉండకపోవచ్చని సూచించింది.
क़ानून यदि सुप्रीम कोर्ट ही बनाएगा तो संसद भवन बंद कर देना चाहिये
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 19, 2025
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!