Khalistani Terrorist: పార్లమెంట్పై దాడి పన్నూ పనేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కాలంలో భారత్ని బెదిరిస్తూ పలు వీడియోల్లో కనిపిస్తున్నాడు. ఇటీవల భారత పార్లమెంట్ పునాదులు కదిలిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి చేస్తామంటూ ఆ వీడియోలో హెచ్చరించాడు. డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్పై లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన అప్జల్ గురు ఫోటోను వెనకాల పెట్టుకుని, గురుపత్వంత్ సింగ్ భారత్ని హెచ్చరించిన వీడియో వైరల్ అయింది.
Read Also: Jammu Kashmir: ఆర్టికల్ 370 తీర్పుపై “ఇస్లాం దేశాల గ్రూప్” అవాకులు.. ఘాటుగా స్పందించిన భారత్..
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
అయితే, ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ స్పందించింది. కొందరు వ్యక్తులు మీడియాలో సస్సేషన్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. ఈ విషయాన్ని యూఎస్, కెనడా అధికారులతో పంచుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే పన్నూ హెచ్చరించిన డిసెంబర్ 13 రోజునే, ఈ రోజు నలుగురు ఆగంతకులు భారత్ పార్లమెంట్పై దాడికి పాల్పడ్డారు. భద్రతను ఉల్లంఘించి ఇద్దరు పార్లమెంట్ హౌజులో ఎల్లో కలర్ డబ్బాలను విసిరారు. దీంతో పార్లమెంట్ ఉక్కసారిగా ఉలిక్కిపడింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ బయట నిరసన తెలిపారు. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే, తాజా ఘటనలో ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూకు ఏమైనా సంబంధం ఉందనే దిశగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతను ఖలిస్తాన్ ఉద్యమం పేరిట కెనడా, అమెరికాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఇతని హత్యకు భారత్ కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా గడ్డపై, అమెరికా పౌరుడిని హతమార్చే కుట్రను అడ్డుకున్నట్లు తెలిపింది. దీనిపై భారత్కి అత్యున్నత స్థాయిలో తన ఆందోళనను తెలియజేసింది. ఈ కుట్రలో ఓ భారతీయ అధికారి ప్రమేయం ఉన్నట్లుగా అమెరికా న్యాయ అభియోగపత్రాల్లో పేర్కొంది.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!