Maharashtra: ఎంతటి విషాదం.. భుజాలపై బిడ్డల శవాలతో 15 కి.మీ నడక.. వైరల్ అవుతున్న వీడియో..
- జ్వరాలతో ఇద్దరు పిల్లలు మృతి..
- సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు..
- బిడ్డల శవాలతో 15 కి.మీ నడిచిన తల్లిదండ్రులు..
- మహరాష్ట్రలో విషాదకరమైన సంఘటన..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో విషాదకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బిడ్డలు విషజ్వరాలతో మరణించడంతో వారి శవాలను భుజాలపై వేసుకుని 15 కి.మీ నడిచి సొంత ఊరికి చేరారు. ఈ సంఘటన సెప్టెంబర్ 4న మారుమూల పట్టిగావ్ గ్రామంలో జరిగింది. 6, 3 ఏళ్ల ఉన్న ఇద్దరు బాలురు సెప్టెంబర్ 4న జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో, సాంప్రదాయ నివారణ కోసం వారు తమ పిల్లల్ని ఓ స్థానిక పూజారి వద్దకు తీసుకెళ్లారు. పూజారి కొన్ని మూలిక ఔషదాలు అందించారు, కానీ అప్పటికే పిల్లలిద్దరి ఆరోగ్యం క్షీణించడంతో వారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మరణించారు.
Read Also: Goa: విద్యార్థిపై ఇద్దరు టీచర్లు పైశాచికం.. చెప్పుతో కొట్టి, తన్ని
Also Read
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
- Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
- Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
పత్తిగావ్ని జిమ్మలగట్టలోని సమీప ఆరోగ్య కేంద్రాన్ని కలిపే రోడ్డు లేకపోవడం, ఆ సమయంలో ఎలాంటి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు బురద మార్గంలో జిమ్మలగట్ట ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు అంబులెన్స్ని పిలిచినప్పటికీ, తదుపరి సాయాన్ని తల్లిదండ్రులు నిరాకరించారు. తమ దు:ఖాన్ని దిగమింగుకుని, విగత జీవులైన ఇద్దరు కుమారుల శవాలను భుజాలపై మోస్తూ గ్రామానికి తీసుకువచ్చారు.
గడ్చిరోలి పూర్తిగా అటవీ ప్రాంతం, కొండలతో కూడిన జిల్లా. ఈ జిల్లాలో చాలా గ్రామాలకు సరైన సదుపాయాలు లేవు. భామ్రాగడ్, ఏటపల్లి, అహేరి తహసీల్లోని చాలా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి విషాదాలు జరిగాయి. ఈ విషాదకరమైన వీడియోని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టికార్ పంచుకున్నారు. ఈ ఘటనపై ఆయన బీజేపీ-ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సరైన సదుపాయాలు సమకూర్చలేదని ప్రభుత్వాన్ని నిందించారు.
दोन्ही लेकरांचे ‘मृतदेह’ खांद्यावर घेऊन चिखलातून वाट शोधत पुढे जात असलेले हे दाम्पत्य गडचिरोली जिल्ह्यातील अहेरी तालुक्यातील आहे.
आजोळी आलेल्या दोन भावंडांना ताप आला. वेळेत उपचार मिळाले नाही. दोन तासांतच दोघांचीही प्रकृती खालावली व दीड तासांच्या अंतराने दोघांनीही अखेरचा श्वास… pic.twitter.com/ekQBQHXeGu
— Vijay Wadettiwar (@VijayWadettiwar) September 5, 2024
తాజావార్తలు
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
-
Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
-
Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
-
SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
-
BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!