Maharashtra: ఎంతటి విషాదం.. భుజాలపై బిడ్డల శవాలతో 15 కి.మీ నడక.. వైరల్ అవుతున్న వీడియో..
- జ్వరాలతో ఇద్దరు పిల్లలు మృతి..
- సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు..
- బిడ్డల శవాలతో 15 కి.మీ నడిచిన తల్లిదండ్రులు..
- మహరాష్ట్రలో విషాదకరమైన సంఘటన..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో విషాదకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బిడ్డలు విషజ్వరాలతో మరణించడంతో వారి శవాలను భుజాలపై వేసుకుని 15 కి.మీ నడిచి సొంత ఊరికి చేరారు. ఈ సంఘటన సెప్టెంబర్ 4న మారుమూల పట్టిగావ్ గ్రామంలో జరిగింది. 6, 3 ఏళ్ల ఉన్న ఇద్దరు బాలురు సెప్టెంబర్ 4న జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో, సాంప్రదాయ నివారణ కోసం వారు తమ పిల్లల్ని ఓ స్థానిక పూజారి వద్దకు తీసుకెళ్లారు. పూజారి కొన్ని మూలిక ఔషదాలు అందించారు, కానీ అప్పటికే పిల్లలిద్దరి ఆరోగ్యం క్షీణించడంతో వారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మరణించారు.
Read Also: Goa: విద్యార్థిపై ఇద్దరు టీచర్లు పైశాచికం.. చెప్పుతో కొట్టి, తన్ని
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
పత్తిగావ్ని జిమ్మలగట్టలోని సమీప ఆరోగ్య కేంద్రాన్ని కలిపే రోడ్డు లేకపోవడం, ఆ సమయంలో ఎలాంటి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు బురద మార్గంలో జిమ్మలగట్ట ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు అంబులెన్స్ని పిలిచినప్పటికీ, తదుపరి సాయాన్ని తల్లిదండ్రులు నిరాకరించారు. తమ దు:ఖాన్ని దిగమింగుకుని, విగత జీవులైన ఇద్దరు కుమారుల శవాలను భుజాలపై మోస్తూ గ్రామానికి తీసుకువచ్చారు.
గడ్చిరోలి పూర్తిగా అటవీ ప్రాంతం, కొండలతో కూడిన జిల్లా. ఈ జిల్లాలో చాలా గ్రామాలకు సరైన సదుపాయాలు లేవు. భామ్రాగడ్, ఏటపల్లి, అహేరి తహసీల్లోని చాలా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి విషాదాలు జరిగాయి. ఈ విషాదకరమైన వీడియోని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టికార్ పంచుకున్నారు. ఈ ఘటనపై ఆయన బీజేపీ-ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సరైన సదుపాయాలు సమకూర్చలేదని ప్రభుత్వాన్ని నిందించారు.
दोन्ही लेकरांचे ‘मृतदेह’ खांद्यावर घेऊन चिखलातून वाट शोधत पुढे जात असलेले हे दाम्पत्य गडचिरोली जिल्ह्यातील अहेरी तालुक्यातील आहे.
आजोळी आलेल्या दोन भावंडांना ताप आला. वेळेत उपचार मिळाले नाही. दोन तासांतच दोघांचीही प्रकृती खालावली व दीड तासांच्या अंतराने दोघांनीही अखेरचा श्वास… pic.twitter.com/ekQBQHXeGu
— Vijay Wadettiwar (@VijayWadettiwar) September 5, 2024
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!