Maharashtra: ఎంతటి విషాదం.. భుజాలపై బిడ్డల శవాలతో 15 కి.మీ నడక.. వైరల్ అవుతున్న వీడియో..
- జ్వరాలతో ఇద్దరు పిల్లలు మృతి..
- సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు..
- బిడ్డల శవాలతో 15 కి.మీ నడిచిన తల్లిదండ్రులు..
- మహరాష్ట్రలో విషాదకరమైన సంఘటన..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో విషాదకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బిడ్డలు విషజ్వరాలతో మరణించడంతో వారి శవాలను భుజాలపై వేసుకుని 15 కి.మీ నడిచి సొంత ఊరికి చేరారు. ఈ సంఘటన సెప్టెంబర్ 4న మారుమూల పట్టిగావ్ గ్రామంలో జరిగింది. 6, 3 ఏళ్ల ఉన్న ఇద్దరు బాలురు సెప్టెంబర్ 4న జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో, సాంప్రదాయ నివారణ కోసం వారు తమ పిల్లల్ని ఓ స్థానిక పూజారి వద్దకు తీసుకెళ్లారు. పూజారి కొన్ని మూలిక ఔషదాలు అందించారు, కానీ అప్పటికే పిల్లలిద్దరి ఆరోగ్యం క్షీణించడంతో వారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మరణించారు.
Read Also: Goa: విద్యార్థిపై ఇద్దరు టీచర్లు పైశాచికం.. చెప్పుతో కొట్టి, తన్ని
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
పత్తిగావ్ని జిమ్మలగట్టలోని సమీప ఆరోగ్య కేంద్రాన్ని కలిపే రోడ్డు లేకపోవడం, ఆ సమయంలో ఎలాంటి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు బురద మార్గంలో జిమ్మలగట్ట ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు అంబులెన్స్ని పిలిచినప్పటికీ, తదుపరి సాయాన్ని తల్లిదండ్రులు నిరాకరించారు. తమ దు:ఖాన్ని దిగమింగుకుని, విగత జీవులైన ఇద్దరు కుమారుల శవాలను భుజాలపై మోస్తూ గ్రామానికి తీసుకువచ్చారు.
గడ్చిరోలి పూర్తిగా అటవీ ప్రాంతం, కొండలతో కూడిన జిల్లా. ఈ జిల్లాలో చాలా గ్రామాలకు సరైన సదుపాయాలు లేవు. భామ్రాగడ్, ఏటపల్లి, అహేరి తహసీల్లోని చాలా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి విషాదాలు జరిగాయి. ఈ విషాదకరమైన వీడియోని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టికార్ పంచుకున్నారు. ఈ ఘటనపై ఆయన బీజేపీ-ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సరైన సదుపాయాలు సమకూర్చలేదని ప్రభుత్వాన్ని నిందించారు.
दोन्ही लेकरांचे ‘मृतदेह’ खांद्यावर घेऊन चिखलातून वाट शोधत पुढे जात असलेले हे दाम्पत्य गडचिरोली जिल्ह्यातील अहेरी तालुक्यातील आहे.
आजोळी आलेल्या दोन भावंडांना ताप आला. वेळेत उपचार मिळाले नाही. दोन तासांतच दोघांचीही प्रकृती खालावली व दीड तासांच्या अंतराने दोघांनीही अखेरचा श्वास… pic.twitter.com/ekQBQHXeGu
— Vijay Wadettiwar (@VijayWadettiwar) September 5, 2024
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?