Pappu Yadav: ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ ప్రకటనతో నాకు సంబంధం లేదు.. పప్పూ యాదవ్ భార్య..
- లారెన్స్ బిష్ణోయ్పై ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలు..
- పప్పూ యాదవ్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న భార్య..
- గత కొంత కాలంగా విడిగా ఉంటున్న ఎంపీ రంజీత్ రంజన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pappu Yadav: ఇటీవల కాలంలో బీహార్ పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ దేశవ్యాప్తంగా ట్రెడింగ్ అవుతున్నాడు. ముంబైలో ఎన్సీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ని చంపిన తర్వాత, ప్రభుత్వం అనుమతి ఇస్తే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నెట్వర్క్ని 24 గంటలో తుదిచిపెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్కి ఫోన్ రావడంతో తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని వేడుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే, పప్పూ యాదవ్ భార్య మాట్లాడుతూ.. తన భర్త చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అన్నారు. కొంత కాలంగా పప్పూ యాదవ్తో విడిపోయి ఉంటున్న అతని భార్య రంజీత్ రంజన్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం బిష్ణోయ్ కమ్యూనిటీ ఎంతో పవిత్రంగా భావించే కృష్ణజింకల్ని చంపడంపై సల్మాన్ ఖాన్కి పప్పూ యాదవ్ సంఘీభావం ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే పప్పూ యాదవ్ ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Read Also: Delhi: పావురాల దాణా నిషేధానికి ఢిల్లీ సర్కార్ ఫ్లాన్! కారణమిదే!
అతని భార్య రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. ‘‘పప్పు జీ,నాకు వేర్వేరు రాజకీయాలు ఉన్నాయి, మా మధ్య విభేదాలు ఉన్నాయి. గత ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాలుగా మేము విడిగా ఉంటున్నాము’’ అని చెప్పారు. అతను ఏ ప్రకటన చేసినా, నాకు నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. ఈ పరిణామాలను శాంతిభద్రతల విషయంగా పేర్కొన్న ఆమె, ప్రభుత్వం దీనిని పరిశీలించాలని కోరారు.
అంతకుముందు, బాబా సిద్ధిక్ మరణం తర్వాత పప్పూ యాదవ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ముంబై నుంచి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా సల్మాన్ ఖాన్ని కలవలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత తనకు 24 గంటల సమయం ఇస్తే బిష్ణోయ్ గ్యాంగ్ లేకుండా చేస్తానని అన్నారు. ఆ తర్వాత నుంచి వరసగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్ బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. ఈ మేరకు తనకు ఉన్న వై సెక్యూరిటీని, జెడ్ సెక్యూరిటీకి అప్గ్రేడ్ చేయాలని కోరాడు. పోలీస్ ఎస్కార్ట్ కావాలని డిమాండ్ చేశాడు. నేను హత్యకు గురైతే ఆ నింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!