Smriti Mandhana: ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్..
- విడిపోయిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్..
- ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ ఫాలో..
- పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే అన్ ఫాలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్కు మంధాన ఫుల్ స్టాప్ పెట్టింది. ఇన్స్టాగ్రామ్లో పెళ్లి రద్దు అయిన విషయాన్ని ప్రకటించింది. పెళ్లి రద్దు గురించి ప్రకటించిన కొంతసేపటికే.. ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. నవంబర్ 23న ఈ జంటకు వివాహం జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకి గుండెపోటు రావడం, పలాష్ కూడా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేయడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
తాజాగా, స్మృతి తన పెళ్లి రద్దును ప్రకటించిన తర్వాత ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం చూస్తే, వీరిద్దరు శాశ్వతంగా విడిపోయినట్లు తెలుస్తోంది. పలాష్ ఆస్పత్రిలో చేరడం, పెళ్లి ఆగిపోయిన తర్వాత అనేక ఊహాగానాలు చుట్టుముట్టాయి. పలాష్ వేరే అమ్మాయితో కలిసి స్మృతిని మోసం చేసినట్లు ఆన్లైన్లో పెద్ద చర్చ నడిచింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Forex Reserve: వరుసగా రెండవ వారం పడిపోయాయిన భారత విదేశీ మారక నిల్వలు.. పెరిగిన బంగారం నిల్వలు
ఆదివారం పలాష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘నేనే నా జీవితంతో ముందుకు సాగాలని, వ్యక్తిగత సంబంధం నుంచి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆధారాలు లేకుండా నను నిందించడం కష్టంగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ. నా నమ్మకాలు, గౌరవంతో దీనిని ఎదుర్కొంటా’’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
దీనికి ముందు స్మృతి కూడా ఇన్స్టాలో తన మెసేజ్ను పోస్ట్ చేసింది. ‘‘నేను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను. మీరంతా కూడా అదే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలి, అలాగే మేము ఈ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగడానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నాను. తన దృష్టి అంతా క్రికెట్పైనే ఉంటుంది. మనందరినీ నడిపించే ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని నేను నమ్ముతాను, నా విషయంలో అది ఎల్లప్పుడూ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే. వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడాలని, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇక ముందుకు సాగే సమయం ఆసన్నమైంది’’ అంటూ పోస్ట్ పెట్టింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!