Kanwar Yatra: యూపీ ‘కన్వర్ యాత్ర’ రూల్స్ని అమెరికా ముందు లేవనెత్తిన పాకిస్తాన్..
- భారత అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం..
- అమెరికా ముందు కన్వర్ యాత్ర రూల్స్ని లేవనెత్తిన దాయాది..
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్లో ‘కన్వర్ యాత్ర’ ఆర్డర్ ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యాయి. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిని వర్ణవివక్ష, హిట్లర్ నాజీ రూల్స్గా ఆరోపించాయి. అయితే, ఈ ఆర్డర్స్ని పాస్ చేసిన ముజఫర్ నగర్ పోలీసులు మాత్రం ఈ నిబంధనను సమర్థించారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు రాకుండా, శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ అంశాన్ని పాకిస్తాన్, అమెరికా వద్ద లేవనెత్తింది. పాకిస్తాన్ జర్నలిస్ట్ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ మాథ్యూ మిల్లర్ వద్ద కన్వర్ యాత్ర గురించి ప్రశ్నించారు. అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యతపై భారత్ని సంప్రదించామని అన్నారు. ‘‘ మేము ఆ నివేదికలను చూశాము. ఆ నిబంధనల అమలుపై భారత సుప్రీంకోర్టు జూలై 22 న మధ్యంతర స్టే జారీ చేసిన నివేదికలను కూడా మేము చూశాము. కాబట్టి ఈ రూల్స్ వాస్తవానికి అమలులో లేవు’’ అని మిల్లర్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా అందరికి మతస్వేచ్ఛ హక్కుని ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Lalu Prasad: బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారు…
పలు సందర్భాల్లో అమెరికా రిపోర్టుల్లో భారత్లో మతస్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని చెబుతోంది. ఈ అంశం ఇరు దేశాల మధ్య వివాదాస్పదమవుతోంది. అనేక సందర్భాల్లో వీటిని పక్షపాత రిపోర్టులుగా భారత్ వ్యతిరేకించింది. మరోవైపు భారత అంతర్గత విషయమైన కన్వర్ యాత్రను పాకిస్తాన్ ప్రస్తావించింది. తమ దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవుల వంటి మైనారిటీలపై దాడుల్ని పట్టించుకోని పాక్, భారత్లో మాత్రం మైనారిటీలపై హింస జరగుతోందని అబద్ధపు ఆరోపణలు చేస్తోంది.
కన్వర్ యాత్రకు సంబంధించి దుకాణదారులు వారి పేర్లను ప్రదర్శించాలనే రూల్స్పై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చర్యపై ప్రతిపక్షాలతో పాటు కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. హిందూ, ముస్లిం షాపుల యజమానుల మధ్య ఆర్థిక అసమానతలను సృష్టించేందుకే ఈ ఉత్తర్వు ఉందని ప్రతిపక్షం పేర్కొంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!