Interpol General Assembly: దావూద్ ఇబ్రహీంను భారత్కి అప్పగిస్తారా..? పాక్ అధికారుల రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani authorities’ silence on Dawood Ibrahim’s hand over To India: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో పాటు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అప్పగింతపై పాకిస్తాన్ అధికారులు సమాధానం దాటవేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ కార్యక్రమానికి పాకిస్తాన్ తమ దేశం తరుపున ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహసీన్ భట్ ను పంపింది. ఇద్దరు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.
పాకిస్తాన్ కరాచీలో దావూద్ ఇబ్రహీం, లాహోర్ ప్రాంతంలో హఫీస్ సయీద్ ఉంటున్నారు. ఇది అందరికి తెలిసిన రహస్యమే. అయితే పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో దావూద్ లేడని బుకాయిస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశం తరువాత వీరిద్దరిని భారత్ కు అప్పగిస్తారా..? అని భారత మీడియా ప్రశ్నించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు మొహసీన్ భట్. సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.
Also Read
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
పాకిస్తాన్, ఇండియా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో పాకిస్తాన్ అధికారులు భారత్ లో జరుగుతున్న ఈ సమావేశానికి రావడం విశేషం. ఇటీవల కాలంలో పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించింది. భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను కట్టడి చేయాలని డిమాండ్ చేసింది. పరిస్థితులు ఇలా ఉన్నా కూడా పాకిస్తాన్ తన ప్రతినిధులను భారత్ పంపింది.
ఇంటర్ పోల్ అత్యున్నత పాలకమండలి దాని పనితీరుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతీ ఏడాది ఒక సారి సమావేశం అవుతుంది. ఈ ఏడాది న్యూ ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సమావేశంలో ప్రసంగించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తాయి. 195 ఇంటర్ పోల్ సభ్యదేశాల నుంచి మంత్రులు, పోలీస్ చీఫ్ లు, ఆయా దేశాల సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతులు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొంటారు. 25 ఏళ్ల విరామం తరువాత 2022లో ఈ సమావేశానికి భారత్ అతిథ్యం ఇచ్చింది. చివరి సారిగా 1997లో ఇండియాలో ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది.
#WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1
— ANI (@ANI) October 18, 2022
తాజావార్తలు
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..