India-Pakistan: యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు: మాజీ అమెరికా అధికారి.
- యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు..
- ఆపరేషన్ సిందూర్పై భారత్ నిర్ణయాత్మక చర్య..
- సంచలన విషయాలు చెప్పిన ఎక్స్- సీఐఏ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో ఆసక్తికర విషయాలు.. వీటి వల్లే మంటలు..!
Also Read
- Public Examinations Act Amendment Bill 2026: లోక్సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
- Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్కు నో చెప్పిన ధర్మాసనం.!
- 15 నెలల వ్యాలిడిటీతో Jio 'Freedom Pack'.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
భారతదేశంలో యుద్ధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పాకిస్తాన్ ఒక నిర్ణయానికి రావాలని మాజీ సీఐఏ అధికారి పేర్కొన్నారు. ‘‘భారత్-పాక్ మధ్య నిజమైన యుద్ధం మంచిది కాదు. ఎందుకంటే పాకిస్తానీలు ఓడిపోతారు. నేను అణ్వాయుధ యుద్ధం గురించి మాట్లాడటం లేదు. సంప్రదాయ యుద్ధం గురించి చెబుతున్నా. నిరంతరం భారతీయుల్ని రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని ఆయన అన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ దాడులు, ఈ ఏడాది ఏప్రిల్లో 26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ దాడి తర్వాత జరిపిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఉగ్రవాదంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని కొనియాడారు.
2001లో పార్లమెంట్ దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ ఉచ్ఛస్థితిలో ఉందని, ఆ సమయంలో భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తుందని 2002లో అమెరికా ఊహించిందని, ఇస్లామాబాద్ నుంచి తమ పౌరుల్ని తరలించినట్లు కిరియాకౌ చెప్పారు. తాను పాకిస్తాన్ లో పదవీకాలంలో ఉన్నప్పుడు, సీఐఏ అల్ఖైదా, ఆఫ్ఘనిస్తాన్పై దృష్టిసారించిందని, భారత్ ఆందోళనల్ని పట్టించుకోలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Public Examinations Act Amendment Bill 2026: లోక్సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
-
Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
-
Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్గా అనిల్ రావిపూడి!
-
Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్కు నో చెప్పిన ధర్మాసనం.!
ట్రెండింగ్
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!