India-Pakistan: యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు: మాజీ అమెరికా అధికారి.
- యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు..
- ఆపరేషన్ సిందూర్పై భారత్ నిర్ణయాత్మక చర్య..
- సంచలన విషయాలు చెప్పిన ఎక్స్- సీఐఏ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో ఆసక్తికర విషయాలు.. వీటి వల్లే మంటలు..!
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
భారతదేశంలో యుద్ధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పాకిస్తాన్ ఒక నిర్ణయానికి రావాలని మాజీ సీఐఏ అధికారి పేర్కొన్నారు. ‘‘భారత్-పాక్ మధ్య నిజమైన యుద్ధం మంచిది కాదు. ఎందుకంటే పాకిస్తానీలు ఓడిపోతారు. నేను అణ్వాయుధ యుద్ధం గురించి మాట్లాడటం లేదు. సంప్రదాయ యుద్ధం గురించి చెబుతున్నా. నిరంతరం భారతీయుల్ని రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని ఆయన అన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ దాడులు, ఈ ఏడాది ఏప్రిల్లో 26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ దాడి తర్వాత జరిపిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఉగ్రవాదంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని కొనియాడారు.
2001లో పార్లమెంట్ దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ ఉచ్ఛస్థితిలో ఉందని, ఆ సమయంలో భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తుందని 2002లో అమెరికా ఊహించిందని, ఇస్లామాబాద్ నుంచి తమ పౌరుల్ని తరలించినట్లు కిరియాకౌ చెప్పారు. తాను పాకిస్తాన్ లో పదవీకాలంలో ఉన్నప్పుడు, సీఐఏ అల్ఖైదా, ఆఫ్ఘనిస్తాన్పై దృష్టిసారించిందని, భారత్ ఆందోళనల్ని పట్టించుకోలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!