Pakistan: “వాణిజ్యం రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేత, సైన్యానికి సెలవులు రద్దు”.. భారత్పై పాక్ ప్రతీకార చర్యలు..
- భారత్పై పాకిస్తాన ప్రతీకార చర్యలు..
- వాణిజ్యం రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేత..
- సింధు ఒప్పందం రద్దు ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణన..
- సైన్యానికి సెలువులు రద్దు, సరిహద్దుల వద్ద క్షిపణి పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్, భారత్ చర్యలపై ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’ సహా భారత్తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేసుకునే హక్కును వినియోగించుకుంటామని తెలిపింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ రోజు జాతీయ భద్రత కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ అధికారులతో పాటు ఆ దేశంలోని కీలక అధికారులు హాజరయ్యారు.
పాకిస్తాన్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేయడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్కి చెందిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. దిగువ నదీ తీరహక్కులను ఆక్రమించడాన్ని ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తున్నట్లు పేర్కొంది.
Also Read
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
Read Also: Danam Nagendar: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్కు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ ఇప్పటికే పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా తగ్గించుకుంది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. ఇండస్ వాటర్ ట్రిటీని రద్దు చేసింది. పాకిస్తాన్-భారత్ సరిహద్దును మూసేసింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది. ‘‘భారతదేశ యాజమాన్యంలోని లేదా భారత్ దేశం నిర్వహించే అన్ని విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలాన్ని తక్షణమే మూసేస్తున్నాం’’ అని పాకిస్తాన్ ప్రకటించింది. భారతతో వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు చెప్పింది. వాఘా సరిహద్దు పోస్టును మూసేస్తున్నామని, హైకమిషన్ సంఖ్యను 30కి తగ్గిస్తామని మరియు భారత హైకమిషన్ నుండి రక్షణ సేవల అధికారులను బహిష్కరిస్తామని కూడా ఇది పేర్కొంది.
మరోవైపు, పాకిస్తాన్ తన యుద్ధ విన్యాసాలను ఎక్కువ చేసింది. క్షిపణి పరీక్షల్ని నిర్వహిస్తోంది. సరిహద్దుల్ని అలర్ట్ చేసింది. సైన్యంలో సెలవుల్ని రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు అందాయి. ఇప్పటికే భారత సరిహద్దుల్లో ఉన్న పాక్ గ్రామాల్లోని ప్రజల్ని అక్కడి ఆర్మీ ఖాళీ చేయించింది.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!