Pakistan: “భారత్తో ఇలానే చేయాలి”, హారిస్ రవూఫ్ ‘6-0’పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు..
- పాక్ పేసర్ హారిస్ రవూఫ్కి పాక్ రక్షణ మంత్రి మద్దతు..
- భారత్తో ఇలానే వ్యవహరించాలని కామెంట్స్..
- ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్లో రవూఫ్ వెక్కిరింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా పాకిస్తాన్ మరిచిపోతోంది.
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ చితక్కొడుతుంటే, ఏం చేయాలో తెలియన హారిస్ రవూఫ్ ఇలా వెక్కిరింతకు దిగాడు. అయితే, పాక్ డైలీ టైమ్స్ అయాబ్ అహ్మద్ రాసిన ఎక్స్ పోస్టును తిరిగి షేర్ చేస్తూ.. ‘‘ హరిస్ హరిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇలాగే కొనసాగించండి. క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి… కానీ 6-0ని భారత్ ఎప్పుడూ మరిచిపోదు. ప్రపంచం కూడా దీనిని గుర్తుంచుకుంటుంది’’ అని పాక్ రక్షణ మంత్రి రాశారు.
Also Read
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
Read Also: Maruti Suzuki sales: జీఎస్టీ ఎఫెక్ట్.. నవరాత్రి మొదటి రోజే 25 వేల కార్లు విక్రయించిన మారుతి..
అయితే, పాక్ ప్రచారం చేసుకుంటున్నట్లు భారత్ విమానాలను కూల్చినట్లు ఎక్కడా ధ్రువీకరణ లేదు. భారత్ చేసిన దాడుల్ని మాత్రం ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా సర్గోదా, నూర్ ఖాన్, జకోబాబాద్, స్కర్దు వంటి మొత్తం 11 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్గా భావించే రావల్పిండి సమీపంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో భారత్ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బ్రహ్మోస్, స్కాల్ప్ మిస్సైళ్లతో పాకిస్తాన్ని భారత్ వణికించింది.
భారత వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ ఆగస్టులో మాట్లాడుతూ.. పాక్ 6 విమానాలను కోల్పోయిందని స్పష్టం చేశారు. ఇందులో 5 ఫైటర్ జెట్లు కాగా, ఒకటి పెద్ద విమానం (బహుషా అవాక్స్ విమానం) కావచ్చు అని చెప్పారు. భారత్ దాడులు పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించాయని, అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం బ్రతిమిలాడిందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
-
Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!