Pakistan: “భారత్తో ఇలానే చేయాలి”, హారిస్ రవూఫ్ ‘6-0’పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు..
- పాక్ పేసర్ హారిస్ రవూఫ్కి పాక్ రక్షణ మంత్రి మద్దతు..
- భారత్తో ఇలానే వ్యవహరించాలని కామెంట్స్..
- ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్లో రవూఫ్ వెక్కిరింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా పాకిస్తాన్ మరిచిపోతోంది.
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ చితక్కొడుతుంటే, ఏం చేయాలో తెలియన హారిస్ రవూఫ్ ఇలా వెక్కిరింతకు దిగాడు. అయితే, పాక్ డైలీ టైమ్స్ అయాబ్ అహ్మద్ రాసిన ఎక్స్ పోస్టును తిరిగి షేర్ చేస్తూ.. ‘‘ హరిస్ హరిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇలాగే కొనసాగించండి. క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి… కానీ 6-0ని భారత్ ఎప్పుడూ మరిచిపోదు. ప్రపంచం కూడా దీనిని గుర్తుంచుకుంటుంది’’ అని పాక్ రక్షణ మంత్రి రాశారు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also: Maruti Suzuki sales: జీఎస్టీ ఎఫెక్ట్.. నవరాత్రి మొదటి రోజే 25 వేల కార్లు విక్రయించిన మారుతి..
అయితే, పాక్ ప్రచారం చేసుకుంటున్నట్లు భారత్ విమానాలను కూల్చినట్లు ఎక్కడా ధ్రువీకరణ లేదు. భారత్ చేసిన దాడుల్ని మాత్రం ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా సర్గోదా, నూర్ ఖాన్, జకోబాబాద్, స్కర్దు వంటి మొత్తం 11 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్గా భావించే రావల్పిండి సమీపంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో భారత్ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బ్రహ్మోస్, స్కాల్ప్ మిస్సైళ్లతో పాకిస్తాన్ని భారత్ వణికించింది.
భారత వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ ఆగస్టులో మాట్లాడుతూ.. పాక్ 6 విమానాలను కోల్పోయిందని స్పష్టం చేశారు. ఇందులో 5 ఫైటర్ జెట్లు కాగా, ఒకటి పెద్ద విమానం (బహుషా అవాక్స్ విమానం) కావచ్చు అని చెప్పారు. భారత్ దాడులు పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించాయని, అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం బ్రతిమిలాడిందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!