Pakistan: “భారత్తో ఇలానే చేయాలి”, హారిస్ రవూఫ్ ‘6-0’పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు..
- పాక్ పేసర్ హారిస్ రవూఫ్కి పాక్ రక్షణ మంత్రి మద్దతు..
- భారత్తో ఇలానే వ్యవహరించాలని కామెంట్స్..
- ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్లో రవూఫ్ వెక్కిరింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా పాకిస్తాన్ మరిచిపోతోంది.
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ చితక్కొడుతుంటే, ఏం చేయాలో తెలియన హారిస్ రవూఫ్ ఇలా వెక్కిరింతకు దిగాడు. అయితే, పాక్ డైలీ టైమ్స్ అయాబ్ అహ్మద్ రాసిన ఎక్స్ పోస్టును తిరిగి షేర్ చేస్తూ.. ‘‘ హరిస్ హరిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇలాగే కొనసాగించండి. క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి… కానీ 6-0ని భారత్ ఎప్పుడూ మరిచిపోదు. ప్రపంచం కూడా దీనిని గుర్తుంచుకుంటుంది’’ అని పాక్ రక్షణ మంత్రి రాశారు.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Read Also: Maruti Suzuki sales: జీఎస్టీ ఎఫెక్ట్.. నవరాత్రి మొదటి రోజే 25 వేల కార్లు విక్రయించిన మారుతి..
అయితే, పాక్ ప్రచారం చేసుకుంటున్నట్లు భారత్ విమానాలను కూల్చినట్లు ఎక్కడా ధ్రువీకరణ లేదు. భారత్ చేసిన దాడుల్ని మాత్రం ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా సర్గోదా, నూర్ ఖాన్, జకోబాబాద్, స్కర్దు వంటి మొత్తం 11 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్గా భావించే రావల్పిండి సమీపంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో భారత్ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బ్రహ్మోస్, స్కాల్ప్ మిస్సైళ్లతో పాకిస్తాన్ని భారత్ వణికించింది.
భారత వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ ఆగస్టులో మాట్లాడుతూ.. పాక్ 6 విమానాలను కోల్పోయిందని స్పష్టం చేశారు. ఇందులో 5 ఫైటర్ జెట్లు కాగా, ఒకటి పెద్ద విమానం (బహుషా అవాక్స్ విమానం) కావచ్చు అని చెప్పారు. భారత్ దాడులు పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించాయని, అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం బ్రతిమిలాడిందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?