Pakistan: భారీగా పాకిస్తాన్ సైన్యం మోహరింపు.. సరిహద్దు గ్రామాలు ఖాళీ..
- పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్లో భయం..
- మరో సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందనే వాదనలు..
- సరిహద్దుల్లో భారీగా పాక్ సైన్యం మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ చంపేశారు. ఈ దాడిలో 28 మంది మరణించారు. దాడికి సంబంధించిన కార్యాచరణ మొత్తం దాయాది దేశం పాకిస్తాన్ జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కరాచీ, పీఓకేలోని ముజఫరాబాద్తో దాడికి సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
మరోవైపు, ఈ రోజు సౌదీ పర్యటనను రద్దు చేసుకుని ఇండియా తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, ఉదయం నుంచి అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు రాజ్నాథ్ సింగ్ కూడా సైన్యాధ్యక్షుడితో, కీలక అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మరో సర్జికల్ స్ట్రైక్ లేదా ఎయిర్ స్ట్రైక్ జరిగే అవకాశాలు ఉన్నాయని, పాకిస్తాన్ పై ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పహల్గామ్ దాడిలో తమ ప్రమేయం లేదని చెబుతూనే, భారత సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఇప్పటికే, పాక్ ఆర్మీ సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించినట్లు సమాచారం. పాక్ వైమానిక దళం పూర్తిగా హై అలర్ట్లో ఉంది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2016లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై మరియు 2019లో బాలాకోట్ టెర్రరిస్ట్ క్యాంపులపై సర్జికల్ దాడులు చేసింది. దీంతో, ఈ దాడికి కూడా భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తన యుద్ధవిమానాలను సిద్ధం చేసింది. సైన్యంతో పాటు పాక్ ఐఎస్ఐ అప్రమత్తమైంది. కరాచీ, రావల్పిండి, లాహోర్ ఎయిర్ బేస్ల నుంచి పాక్ వైమానిక దళం అసాధారణ కదలికలు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!