Pahalgam terror attack: పీఓకేలో 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్.. కాశ్మీర్లో 56 మంది ఉగ్రవాదులు..
- పీఓకేలో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్..
- సరిహద్దుల్లో 130 మంది టెర్రరిస్టులు..
- జమ్మూ కాశ్మీర్లో 56 మంది ఉగ్రవాదులు యాక్టివ్..
- కీలక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ సంస్థలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగవారం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. ఉగ్రవాదులు టూరిస్టుల్ని చుట్టుముట్టి కాల్చి చంపారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేశారు. పేర్లు, ఐడెంటిటీ కార్డుల్ని అడుగుతూ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ సమయంలో భారత్కి అండగా నిలుస్తామని చెప్పాయి. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో సరిహద్దు వెంబడి 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నట్లు మన నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ లాండ్ ప్యాడ్స్లో శిక్షణ పొందిన టెర్రరిస్టులు, సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ స్థావరాల్లో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉన్నారని అంచనా, వీరిలో 115 మంది పాకిస్తానీ జాతీయులని గుర్తించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Pahalgam Terror Attack: కరాచీ, ముజఫరాబాద్లో ఉగ్రవాద హ్యాండర్లు.. పాక్ ప్రమేయంపై సంచలన ఆధారాలు..
మరోవైపు, భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 56 మంది ఉగ్రవాదులు యాక్టీవ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 18 మంది జైషే మహ్మద్, 35 మంది లష్కరే తోయిబా, ముగ్గురు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 17 మంది స్థానిక కాశ్మీర్ ఉగ్రవాదులు కాగా, మిగతా వారు పాకిస్తాన్కి చెందిన వారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికిలో 5-6 మంది ఉగ్రవాదులు ఉన్నారు. కామోఫ్లేజ్ గేర్ మరియు కుర్తా-పైజామాలు ధరించిన వీరు అడవుల నుంచి వచ్చి, ఏకే-47 ఉపయోగించి కాల్పులు జరిపారు. అత్యున్నత సైనిక శిక్షణ, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను వాడారు. దీనిని బట్టి చూస్తే వీరికి పాక్ ఆర్మీ, ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు, వీరి ఫోటోలను విడుదల చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!