Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- ఆరుగురు పిల్లలున్నంత మాత్రాన ఓటు హక్కు ఉండదా..?
- ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఓటర్ల జాబితా అప్డేట్ ప్రక్రియపై ఎంఐంఎ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంలో పిల్లల సంఖ్య ఆధారంగా ఓటర్లను గుర్తించే విధానాన్ని విమర్శించారు. భారతదేశంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఓటు హక్కును నిరాకరించే చట్టం లేదని స్పష్టం చేశారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారి కుటుంబాలను మ్యాపింగ్ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఓటర్ల జాబితా మ్యాపింగ్ సమయంలో ఐదుగురుకి పైగా పిల్లలు ఉన్న కుటుంబాల వివరాలు మ్యాపింగ్ చేయడం లేదని చెబుతున్నారు. నాకే ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆరుగురు పిల్లలు ఉన్నవారు ఓటు వేయకూడదని ఏ చట్టంలో లేదు. ప్రధాని మోడీకి ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. హోం మంత్రి అమిత్ షాది కూడా పెద్ద కుటుంబమే. సీఎం యోగి కుటుంబంలో కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు’’ అని ఓవైసీ అన్నారు. ప్రతీ భారతీయ పైరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని ఓవైసీ గుర్తు చేశారు.
Also Read
ఓటర్ల జాబితా అప్డేట్లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు ఆయన తెలిపారు. 2002, 2024 ఓటర్ల జాబితాను సరిచూస్తున్నారని, ఈ ప్రక్రియలో అనేక వ్యత్యాసాలు బయపడుతున్నాయని అన్నారు. ఒక వ్యక్తి, ఆయన తండ్రి మధ్య వయసు తేడా 15 ఏళ్లు ఉంటే ఎన్నికల సంఘం దానిని ఒక లోపంగా పరిగణిస్తోందని, తాత-మనవళ్ల మధ్య వయసు వ్యత్యాసాల విషయంలో కూడా ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
జూన్ 25 నుంచి జనాభా గణన పత్రాల పంపిణీ జరుగుతుందని, వీటిని ఇంట్లో ఉంచుకోకుండా, వెంటనే నింపి అధికారులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ పత్రాలను సమర్పించకపోతే, మీ పేరు ముసాయిదా జాబితాలో కనిపించదని, మీ చిరునామా మారితే ఫారం 8, మీ పేరు జాబితాలో లేకపోతే ఫారం 6 నింపి, పత్రాలపై సంతకాలు చేసి, బీఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. ఇది కేవలం ఓటు హక్కు కోల్పోవడం గురించి మాత్రమే కాదని, మీ పౌరసత్వం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఓటర్ జాబితాల నుంచి పేదలు, దళితులు, ముస్లింల పేర్లు తొలగించి వారికి దేశ పౌరసత్వం లేనివారిగా మార్చాలని దేశంలో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!