Osamu Suzuki: భారత ఆటోమొబైల్స్ రంగాన్ని వెలుగు వెలిగించిన “ఒసాము సుజుకి” మరణం..
- ఆటోమొబైల్ దిగ్గజం ఒసాము సుజుకి కన్నుమూత..
- భారత్లో ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపిరి..
- ఆయన సేవలకు ‘‘పద్మభూషణ్’’ ఇచ్చిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Osamu Suzuki: జపనీస్ ఆటోమొబైల్స్ దిగ్గజం సుజుకి మోటార్ ఛైర్మన్, సీఈఓ ఒసాము సుజుకి(94) కన్నుమూశారు. ప్రాణాంతక లింఫోమాతో పోరాడుతూ డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తోషిహిరో సుజుకి తెలిపారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇసాము సుజుకి 1930 జనవరి 30న ఓ జపనీస్ వ్యవసాయ కుటుంబంలో 4వ సంతానంగా జన్మించారు. మొదట్లో రాజకీయ నాయకుడు కావాలని ఆశించిన సుజుకీ, ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సుజుకీ మోటార్స్కి ఎక్కువ కాలం బాస్గా పనిచేశారు. టోక్యోలని చువో యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదవిని ఆయన జూనియర్ హైస్కూల్ టీచర్గా, నైట్ గార్డ్గా పార్ట్ టైమ్ జామ్ కూడా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్యాంక్లో పని చేశారు.
షోకో సుజుకితో వివాహం ఆయన జీవితాన్ని గొప్పమలుపు తిప్పింది. షోకో సుజుకి సుజికీ మోటార్స్ అధినేతకు మనవరాలు. ఆయనకు మగవారసులు లేకపోవడంతో, జపనీస్ ఆచారం ప్రకారం.. ఒసాము సుజుకి తన భార్య ఇంటి పేరును తీసుకుని ఆటోమొబైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల పాటు సుజుకి మోటార్స్ కంపెనీని నడిపించారు. 28 ఏళ్ల పాటు కంపెనీ ఛైర్మన్గా పనిచేశారు. 2015లో బాధ్యతల్ని తన కొడుకు తోహిహిరోకి అప్పగించినప్పటికీ, కంపెనీకి ఛైర్మన్, సీఈవోగా కొనసాగారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
భారత ఆటోమొబైల్స్ రంగానికి ఓ వెలుగునిచ్చాడు
లైసెస్సు పాలన, క్లోజ్డ్ ఎకానమిగా భారత్ ఉన్న సమయంలోనే, భారత్లో ఆటోమొబైల్ రంగం విస్తరిస్తుందని ఊహించిన ఒసాము సుజుకీ 1981లో దేశంలోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. దేశంలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ పెరగడానికి కారణమయ్యారు. మారుతీ ఉద్యోగ లిమిటెడ్ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్గా మారింది. సుజుకీ మోటార్ కార్పొరేషన్లో మెజారిటీ వాటా ఉన్న ప్రభుత్వం 2007లో దాని నుంచి బయటకు వచ్చింది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్కు ఒసాము సుజుకి డైరెక్టర్ మరియు గౌరవ ఛైర్మన్గా ఉన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ, భారత్-జపాన్ బంధానికి వారధిగా నిలిచిన ఒసాముకి భారత ప్రభుత్వం ‘‘పద్మభూషణ్’’తో సత్కరించింది. దేశంలో ఇప్పటికీ ఐకానిక్ కారుగా ఉన్న మారుతి 800ని పరిచయం చేయడంలో ఒసాము సుజుకి పాత్ర ఉంది. ఈ కారు దేశంలో కార్ మార్కెట్ విస్తరణకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!