Vinay Narwal: పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్
- పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఒసాఫ్ ఖాన్ అరెస్ట్
పహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్పై ఓ నీచుడు దుర్మార్గపు కామెంట్ చేశాడు. భార్యనే ఒక షూటర్ను నియమించుకుని చంపేసిందంటూ దారుణంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అసలే ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలు.. నీచానికి ఒడిగట్టిన వైద్య వృత్తికి చెందిన ఒసాఫ్ ఖాన్పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జబల్పూర్కు చెందిన ఒసాఫ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మంగళవారం పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ పక్కనే కూర్చుని భార్య దు:ఖిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఫొటోపై జబల్పూర్కు చెందిన ఒసాఫ్ ఖాన్ సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్ చేశాడు. భార్యనే షూటర్ను పెట్టుకుని హత్య చేయించిందని దారుణంగా కామెంట్ చేశాడు. ఆ మహిళపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందేనని.. అవకాశం వచ్చింది కాబట్టి చంపేసి ఉండొచ్చని పేర్కొన్నాడు. ఇది స్థానికులకు కోపం తెప్పించింది. దీంతో అభయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఒసాఫ్ ఖాన్ అరెస్ట్ చేశారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరాడు. ప్రస్తుతం కొచ్చిలో నేవీ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 16న వివాహం జరిగింది. ఇక ఏప్రిల్ 19న గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. అనంతరం భార్యతో కలిసి పహల్గామ్ హనీమూన్కు వెళ్లారు. వాస్తవానికి వేరే దేశానికి వెళ్లాలని ప్లాన్ చేశారు. వీసా రాకపోవడంతో పహల్గామ్ వెళ్లారు. అలా భార్యతో కలిసి విహరిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రమూకలు విరుచుకుపడి కాల్పులకు తెగబడ్డారు. అక్కడికక్కడే వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇలా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా దు:ఖంలో ఉంటే.. కొందరు నీచులు ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!