Bihar: అరే ఏంట్రా ఇది.. మైదానంలో రూ.3 కోట్లతో వంతెన..
- బీహార్లో ఇంతే కావచ్చు..
- మైదానంలో రోడ్డు లేకుండా బ్రిడ్జ్..
- వైరల్ అవుతున్న రూ. 3 కోట్ల వంతెన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: ఇటీవల కాలం భారీ వర్షాలు, వరదల కారణంగా వంతెనలు పేకమేడల్లా కూలిపోయాయి. పలు జిల్లా్ల్లో వంతెనలు కూలిపోయిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీహార్లోని జేడీయూ ప్రభుత్వంపై ఇటు ఆర్జేడీ తీవ్ర విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ బ్రిడ్జి నిర్మాణం వైరల్గా మారింది. పూర్తిగా మైదాన ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ నిర్మించిన ఫోటో వైరల్ అయింది. ఈ బ్రిడ్జ్కి రోడ్డు లేకపోవడం, పొలాల్లో ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇరు వైపులా రోడ్డు లేకుండా రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించారు.
Read Also: IND vs SL: స్పిన్ దెబ్బకు చేతులెత్తిసిన టీమిండియా.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక ..
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
ముఖ్యమంత్రి గ్రామీణ సడక్ పథకం కింద అరారియా జిల్లాలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. పర్మానందర్పూర్ గ్రామంలో 3 కి.మీ పొడవైన రహదారి, వంతెన ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతంలో నది ఉందని, వర్షాకాలంలో సమస్యగా మారుతోందని, మిగిలిన ఏడాది ఇది ఎండిపోయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో గ్రామాలను కలుపేందుకు రోడ్డు, వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మితమైన ప్రాంతాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే, మిగిలిన ప్రాంతాన్ని అధికారులు ఇంకా సేకరించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో సేకరించిన భూమిలో ప్రభుత్వం అప్రోచ్ మార్గం లేకుండానే వంతెన నిర్మించింది. దీనిపై అరారియా జిల్లా కలెక్టర్ ఇనాయత్ ఖాన్ స్పందించారు. ‘‘ ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి నివేదిక కోరాను. దీంతో పాటు సబ్ డివిజనల్ అధికారి, సర్కిల్ ఆఫీసర్, సంబంధిత ఇంజనీర్ సైట్ని సందర్శించాలని కోరాను. భూములు అందుబాటులో లేని సందర్భంతో ఈ ప్లాన్ ఎలా రూపొందించారనే విషయాన్ని పరిశీలిస్తున్నాము. అవసరమైన చర్యలు తీసుకుంటాము’’ అని కలెక్టర్ చెప్పారు.
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!