Goa: టూరిస్ట్ బోటు బోల్తా.. ఒకరి మృతి.. 20 మంది సేఫ్!
- గోవాలో టూరిస్ట్ బోటు బోల్తా
- ఒకరి మృతి.. 20 మంది సేఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఫెర్రీ బోటు ప్రమాదం మరువక ముందే గోవాలో మరో ప్రమాదం జరిగింది. గోవాలోని కలాంగుట్ బీచ్లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 20 మందిని రక్షించారు. ప్రమాదంలో 54 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల పడవ బోల్తా పడిందని.. ఒకరు చనిపోగా.. 20 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: China: మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్కి కొత్త ముప్పు..
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ఇద్దరు ప్రయాణికులు మినహా మిగతా వారంతా లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో ఆరేళ్లలోపు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. తీరప్రాంతానికి 60 మీటర్ల దూరంలో పడవ బోల్తా పడిందని, దీంతో ప్రయాణికులంతా సముద్రపు నీటిలో పడిపోయారని ప్రభుత్వం నియమించిన లైఫ్సేవింగ్ ఏజెన్సీ మెరైన్ ప్రతినిధి తెలిపారు. గాయపడిన ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన వారిని అంబులెన్స్లో వైద్య సదుపాయానికి తరలించినట్లు ప్రతినిధి తెలిపారు. 20 మంది ప్రయాణీకుల్లో ఆరు మరియు ఏడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే 25 మరియు 55 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు ఉన్నారు. పడవలో ఇద్దరు ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదని ఆయన చెప్పారు
ఇటీవల ముంబై తీరంలో ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల సాయం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Safety Tips: పొగమంచు కమ్మేస్తోంది.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!