Congress: ఇందిరాగాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకున్న ఖలిస్తానీవాదులు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కెనడా ఖలిస్తానీ వేర్పాటువాదులకు కేంద్రంగా మారుతోంది. భారత వ్యతిరేఖతను అక్కడ కొంతమంది సిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగిన ఓ పరేడ్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఇద్దరు సిక్కు బాడీగార్డులు చంపుతున్నట్లు చూపించే శకటాన్ని ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని భారతవిదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ని కోరింది. దీనిపై విలేకరులు అడిన ప్రశ్నకు జైశంకర్ కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు చోటివ్వడం సమస్యగా ఉందని అన్నారు.
Read Also: Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
అంతకుముందు భారతదేశంలో కెనడా హైకమీషనర్ కామెరూన్ మాకే మాట్లాడుతూ.. భారత ప్రధాని హత్యను సెలబ్రేట్ చేసిన ఘటన గురించి తెలిసి షాక్ అయ్యానని అన్నారు. కెనడాలో ద్వేషానికి, హింసను కీర్తించడానికి చోటు లేదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ మిలింద్ దేవరా దీనిపై స్పందిస్తూ.. ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన శకటాన్ని 5 కిలోమీటర్లు పెరెడ్ నిర్వహించడాన్ని చూసి భారతీయుడిగా నేను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ఇది హేయమైన చర్య అని, దీనిపై జైశంకర్, కెనడా అధికారులపై గట్టిగా వ్యవహరించాలని మరో కాంగ్రెస్ నేత జైరాంరమేష్ ట్వీట్ చేశారు. పార్టీలకి అతీతంగా దీనిపై చర్యలు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్ చేశారు.
అంతకుముందు ఈ ఘటనపై జైశంకర్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుంటే ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు, దీన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. పరోక్షంగా కెనడా తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ఇరు దేశాల సంబంధాలకు మంచిది కాదని కెనడాకు సూచించారు. 1984లో స్వర్ణదేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించిన కొన్ని నెలల తర్వాత ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులే కాచ్చి చంపారు.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!