Congress: ఇందిరాగాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకున్న ఖలిస్తానీవాదులు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కెనడా ఖలిస్తానీ వేర్పాటువాదులకు కేంద్రంగా మారుతోంది. భారత వ్యతిరేఖతను అక్కడ కొంతమంది సిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగిన ఓ పరేడ్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఇద్దరు సిక్కు బాడీగార్డులు చంపుతున్నట్లు చూపించే శకటాన్ని ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని భారతవిదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ని కోరింది. దీనిపై విలేకరులు అడిన ప్రశ్నకు జైశంకర్ కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు చోటివ్వడం సమస్యగా ఉందని అన్నారు.
Read Also: Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
అంతకుముందు భారతదేశంలో కెనడా హైకమీషనర్ కామెరూన్ మాకే మాట్లాడుతూ.. భారత ప్రధాని హత్యను సెలబ్రేట్ చేసిన ఘటన గురించి తెలిసి షాక్ అయ్యానని అన్నారు. కెనడాలో ద్వేషానికి, హింసను కీర్తించడానికి చోటు లేదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ మిలింద్ దేవరా దీనిపై స్పందిస్తూ.. ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన శకటాన్ని 5 కిలోమీటర్లు పెరెడ్ నిర్వహించడాన్ని చూసి భారతీయుడిగా నేను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ఇది హేయమైన చర్య అని, దీనిపై జైశంకర్, కెనడా అధికారులపై గట్టిగా వ్యవహరించాలని మరో కాంగ్రెస్ నేత జైరాంరమేష్ ట్వీట్ చేశారు. పార్టీలకి అతీతంగా దీనిపై చర్యలు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్ చేశారు.
అంతకుముందు ఈ ఘటనపై జైశంకర్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుంటే ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు, దీన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. పరోక్షంగా కెనడా తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ఇరు దేశాల సంబంధాలకు మంచిది కాదని కెనడాకు సూచించారు. 1984లో స్వర్ణదేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించిన కొన్ని నెలల తర్వాత ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులే కాచ్చి చంపారు.
తాజావార్తలు
-
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
-
BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!