Congress: ఇందిరాగాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకున్న ఖలిస్తానీవాదులు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కెనడా ఖలిస్తానీ వేర్పాటువాదులకు కేంద్రంగా మారుతోంది. భారత వ్యతిరేఖతను అక్కడ కొంతమంది సిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగిన ఓ పరేడ్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఇద్దరు సిక్కు బాడీగార్డులు చంపుతున్నట్లు చూపించే శకటాన్ని ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని భారతవిదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ని కోరింది. దీనిపై విలేకరులు అడిన ప్రశ్నకు జైశంకర్ కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు చోటివ్వడం సమస్యగా ఉందని అన్నారు.
Read Also: Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
అంతకుముందు భారతదేశంలో కెనడా హైకమీషనర్ కామెరూన్ మాకే మాట్లాడుతూ.. భారత ప్రధాని హత్యను సెలబ్రేట్ చేసిన ఘటన గురించి తెలిసి షాక్ అయ్యానని అన్నారు. కెనడాలో ద్వేషానికి, హింసను కీర్తించడానికి చోటు లేదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ మిలింద్ దేవరా దీనిపై స్పందిస్తూ.. ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన శకటాన్ని 5 కిలోమీటర్లు పెరెడ్ నిర్వహించడాన్ని చూసి భారతీయుడిగా నేను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ఇది హేయమైన చర్య అని, దీనిపై జైశంకర్, కెనడా అధికారులపై గట్టిగా వ్యవహరించాలని మరో కాంగ్రెస్ నేత జైరాంరమేష్ ట్వీట్ చేశారు. పార్టీలకి అతీతంగా దీనిపై చర్యలు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్ చేశారు.
అంతకుముందు ఈ ఘటనపై జైశంకర్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుంటే ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు, దీన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. పరోక్షంగా కెనడా తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ఇరు దేశాల సంబంధాలకు మంచిది కాదని కెనడాకు సూచించారు. 1984లో స్వర్ణదేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించిన కొన్ని నెలల తర్వాత ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులే కాచ్చి చంపారు.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!