Jammu Kashmir: నేడు పహల్గామ్లో కేబినెట్ భేటీ.. దేనికోసమంటే..!
- నేడు పహల్గామ్లో ఒమర్ అబ్దుల్లా కేబినెట్ భేటీ
- తొలిసారి టూరిస్ట్ ఏరియాలో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది. ఇక శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా తొలిసారి పహల్గామ్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Shocking Incident: మరీ ఇంత దారుణమా.. డ్రైవర్ను జేసీబీకి కట్టేసి చితకబాదిన రౌడీ షీటర్..!
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పర్యాటక రంగం కుదేలైంది. ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మంగళవారం పహల్గామ్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసకుంది. ఈ భేటీ ద్వారా పర్యాటకులకు, స్థానికులకు ఒక సంఘీభావంగా ఉంటుందని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Shehbaz Sharif: ఆ మూడింటిపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని
ఇక ఈ కేబినెట్ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఇంకా బహిరంగంగా ప్రకటించనప్పటికీ.. జమ్మూకాశ్మీర్లో హింసకు చోటు లేదని.. దేశ వ్యతిరేకులకు, సామాజిక వ్యతిరేకులకు ఒక సందేశాన్ని ఇచ్చేందుకే ఈ కేబినెట్ భేటీ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఒమర్ అబ్దుల్లా తొలిసారి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా 2009-14 వరకు పని చేసిన సమయంలో ఉత్తర కాశ్మీర్లోని గురేజ్, మాచిల్, తంగ్ధర్, జమ్మూ ప్రాంతంలోని రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. అయితే ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అబ్దు్ల్లా మాట్లాడుతూ.. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. భద్రత, ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతామని.. పర్యాటక రంగాన్ని మళ్లీ పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తామని.. తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు వచ్చేలా కృష్టి చేస్తానని అబ్దుల్లా ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా పహల్గామ్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఏప్రిల్ 28న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసే కుట్రలను ఎదుర్కొంటామని అబ్దుల్లా ప్రకటించారు. పౌరులందరికీ శాంతి, అభివృద్ధి, సమగ్ర శ్రేయస్సు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!