Jammu Kashmir: నేడు పహల్గామ్లో కేబినెట్ భేటీ.. దేనికోసమంటే..!
- నేడు పహల్గామ్లో ఒమర్ అబ్దుల్లా కేబినెట్ భేటీ
- తొలిసారి టూరిస్ట్ ఏరియాలో సమావేశం
జమ్మూకాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది. ఇక శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా తొలిసారి పహల్గామ్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Shocking Incident: మరీ ఇంత దారుణమా.. డ్రైవర్ను జేసీబీకి కట్టేసి చితకబాదిన రౌడీ షీటర్..!
Also Read
- SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. "కాంగ్రెస్కు పవర్ ఇస్తాం.. మా విజయ్ను సీఎంను చేయండి!"
- Vijay TVK: "బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే 'తుపాకీ'! విజయ్ సీఎం అవుతాడా?
- West Bengal Results: తృణమూల్ కోటలో 'కమల' వికాసం.. బెంగాల్లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
- Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పర్యాటక రంగం కుదేలైంది. ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మంగళవారం పహల్గామ్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసకుంది. ఈ భేటీ ద్వారా పర్యాటకులకు, స్థానికులకు ఒక సంఘీభావంగా ఉంటుందని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Shehbaz Sharif: ఆ మూడింటిపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని
ఇక ఈ కేబినెట్ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఇంకా బహిరంగంగా ప్రకటించనప్పటికీ.. జమ్మూకాశ్మీర్లో హింసకు చోటు లేదని.. దేశ వ్యతిరేకులకు, సామాజిక వ్యతిరేకులకు ఒక సందేశాన్ని ఇచ్చేందుకే ఈ కేబినెట్ భేటీ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఒమర్ అబ్దుల్లా తొలిసారి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా 2009-14 వరకు పని చేసిన సమయంలో ఉత్తర కాశ్మీర్లోని గురేజ్, మాచిల్, తంగ్ధర్, జమ్మూ ప్రాంతంలోని రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. అయితే ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అబ్దు్ల్లా మాట్లాడుతూ.. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. భద్రత, ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతామని.. పర్యాటక రంగాన్ని మళ్లీ పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తామని.. తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు వచ్చేలా కృష్టి చేస్తానని అబ్దుల్లా ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా పహల్గామ్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఏప్రిల్ 28న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసే కుట్రలను ఎదుర్కొంటామని అబ్దుల్లా ప్రకటించారు. పౌరులందరికీ శాంతి, అభివృద్ధి, సమగ్ర శ్రేయస్సు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
-
SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్కు పవర్ ఇస్తాం.. మా విజయ్ను సీఎంను చేయండి!”
-
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
-
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
-
West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!