Shocking Incident: మరీ ఇంత దారుణమా.. డ్రైవర్ను జేసీబీకి కట్టేసి చితకబాదిన రౌడీ షీటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: రాజస్థాన్లోని బేవార్ జిల్లా రాయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన కాస్త ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. గుడియా గ్రామానికి చెందిన చరిత్రాపాతి తేజపాల్ సింగ్ ఉదావత్ అనే వ్యక్తి, తన సొంత డ్రైవర్ను జేసీబీకి తలకిందులుగా కట్టేసి, బెల్ట్తో దారుణంగా కొట్టాడు. ఈ హింసాత్మక ఘటన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. డ్రైవర్ గాయపడిన తరువాత కూడా, అతని వదలకుండా గాయాలపై ఉప్పు రుద్ది తీవ్రంగా వేధించారు. ఈ ఘటన మూడు నెలల క్రిందట జరిగిందని, అయితే ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రసతుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
తేజపాల్ సింగ్ ఉదావత్ గుడియా గ్రామానికి చెందినవాడు. అతనికి గ్రామ సమీపంలో ఒక ఫార్మ్హౌస్ ఉంది. అక్కడ జేసీబీలు, డంపర్లు ఇంకా అనేక ఇతర వాహనాలు ఉంటాయి. సమాచారం ప్రకారం, తేజపాల్ అనధికార గ్రావెల్ తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతని మీద రాయపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి.. సుమారు మూడు నెలల క్రితం, తేజపాల్ తన డ్రైవర్ను డీజిల్ దొంగతనంపై అనుమానంతో పట్టుకొని, జేసీబీకి తలకిందులుగా కట్టాడు. అనంతరం బెల్ట్తో కొట్టి గాయపరిచాడు. గాయాలపై ఉప్పు రుద్దడంతో డ్రైవర్ తీవ్రంగా శారీరక బాధను అనుభవించాడు.
Read Also: Shehbaz Sharif: ఆ మూడింటిపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని
ఇక ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఫార్మ్హౌస్ వద్ద చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ, ఎవరూ అతడిని రక్షించడానికి ముందుకురాలేదు. ఎందుకంటే తేజపాల్ భయంతో అందరూ సైలెంట్ గా ఉంది పోయారు. అతనికి ఎవరు ఎదురు మాట్లాడినా, వాళ్లకు కూడా అదే శిక్ష పడేది అనే భయమే అందరినీ వెనక్కి నెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడిన వెంటనే, పోలీసులు అప్రమత్తమై తేజపాల్ సింగ్ను అరెస్ట్ చేశారు. ఇక ఈ హింసాత్మక ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోతసారా కూడా తీవ్రంగా స్పందించారు.
राजस्थान में माफियाओं की गुंडागर्दी चरम पर है भाजपा सरकार में माफियाओं पर कानून का कोई खौफ नहीं है।
गुंडों ने जिस तरह से एक व्यक्ति को जेसीबी से लटकाकर बुरी तरह मारपीट की यह तस्वीरें @PoliceRajasthan की नाकामी दिखाती है@BhajanlalBjp जी सत्ता संरक्षण में दलितों का दमन कब तक ? pic.twitter.com/4aOLIsL1aj
— Jitendra Hatwal (@Jitendra_Hatwal) May 24, 2025
రాజస్థాన్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాదు, మాఫియాలే పాలిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇలాంటి భయానక ఘటనలు జరిగాయని, బీజేపీ పాలనలో మాఫియాల దుర్మార్గం తన గరిష్ఠ స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాన్ని చేసిన తేజపాల్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..