Supreme Court: ఒడిశా రైలు ప్రమాదంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని పిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రైలు ప్రమాదం జరగలేదు. ఏకంగా 288 మంది ప్రయాణికులు మరణించడంతో పాటు 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వేలోని ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిగితే తప్పా కారణాలు తెలియరావు.
Read Also: Cleaver Thief : సినిమా స్టైల్లో చోరీ.. రైలు బాత్రూం నుంచి తెలివిగా పరార్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. రైలు ప్రమాదంపై విచారణకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్లో రైల్వే వ్యవస్థలో ప్రమాదాలు, భద్రతా పారామితులను విశ్లేషించడానికి, సమీక్షించడానికి, సూచించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మరియు సాంకేతిక సభ్యులతో కూడిన నిపుణుల కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్ రెండు నెలల్లో తన విచారణను ముగించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి, దాని నివేదికను సుప్రీంకోర్టు ముందు సమర్పించాలని పిటిషన్లో పేర్కొంది. కవాచ్ వ్యవస్థను త్వరగా అమలు చేయకపోవడం వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం మరియు ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిందని అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిల్ లో ఆరోపించారు. భారతీయ రైల్వేలలో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్ కవాచ్ అమలుకు మార్గదర్శకాలను జారీ చేయాలని కూడా కోరింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును పరిరక్షించేందుకు, రైల్వేలో చర్యలను పరిష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారలిన తివారీ పిటిషన్ లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!