Durgapur Gang Rape: బెంగాల్లో మాకు రక్షణ లేదు, ఒడిశా వెళ్తాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి..
- బెంగాల్లో మాకు రక్షణ లేదు, ఒడిశా వెళ్తాం..
- మాకు నమ్మకం పోయింది..
- దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durgapur Gang Rape: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో ఏడాది మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి క్యాంపస్ బయటకు రాగా, కొంత మంది నిందితులు ఆమెను క్యాంపస్కు సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బెంగాల్లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే, బాధితురాలి తండ్రి తన కూతురు పడుతున్న వేధన గురించి కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు బెంగాల్లో రక్షణ లేదని, ఒడిశా వెళ్లిపోతామని, బెంగాల్లో తన కూతురు భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ‘‘నా కుమార్తె నొప్పితో బాధపడుతోంది. ఆమె ప్రస్తుతం నడవలేకపోతోంది. ఆమె మంచం పట్టింది. ఇక్కడ ఆమె భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. వారు ఆమెను ఇక్కడ ఏ క్షణంలోనైనా చంపవచ్చు. అందుకే మేము ఆమెను ఒడిశాకు తిరిగి తీసుకెళ్లాలనుకుంటున్నాము. నమ్మకం పోయింది. ఆమె బెంగాల్లో ఉండటం మాకు ఇష్టం లేదు. ఆమె ఒడిశాలో తన చదువును కొనసాగిస్తుంది’’ అని ఏఎన్ఐతో చెప్పారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Mamata Banerjee: “అమ్మాయిలు రాత్రి బయటకు రాకూడదు”.. గ్యాంగ్రేప్పై మమత వివాదం..
ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన 23 ఏళ్ల యువతి దుర్గాపూర్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు, కొంతమంది పురుషులు బలవంతంగా ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఘీ తమతో మాట్లాడారని బాధితురాలి తండ్రి చెప్పారు. ఒడిశా ప్రభుత్వం తమకు సాయం చేస్తోందని చెప్పారు. తన కుమార్తెకు ఒడిశా వైద్య కాలేజీలో అడ్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించినట్లు చెప్పారు. ఈ నేరంతో సంబంధం ఉన్న అరెస్టయిన ముగ్గురిని అపు బౌరి (21), ఫిర్దోస్ సేఖ్ (23), సేఖ్ రియాజుద్దీన్ (31) గా గుర్తించారు. ఆమె బాయ్ఫ్రెండ్ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డాక్టర్పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఏడాది తర్వాత, కోల్కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిన నెలల తర్వాత దుర్గాపూర్లో ఈ సంఘటన జరిగింది.
#WATCH | Paschim Bardhaman, West Bengal | Father of the Durgapur alleged gangrape victim, says, "… She is unable to walk and is on bedrest. The Chief Minister, DG, SP, and Collector are all helping us a lot and regularly enquiring about her health… I have requested the Chief… pic.twitter.com/W4u54SMnwl
— ANI (@ANI) October 12, 2025
తాజావార్తలు
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?