Rajashree Swain: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Cricketer Rajashree Swain Found Dead In Katak Forest: ఒడిశాలో ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోయిన మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అడవిలో శవమై కనిపించింది. కటక్కి సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒక చెట్టుకు వేలాడుతూ, ఉరి వేసుకున్న స్థితిలో గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాజశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రాజశ్రీ మృతదేహం లభ్యమైన కొంతదూరంలో ఆమె స్కూటర్ లభించింది. చెట్టుకు వేలాడుతూ కనిపించింది కాబట్టి.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది ఇప్పుడే చెప్పలేమని.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక ఆమె మృతికి కారణం తెలుస్తుందని డీసీపీ పినాక్ మిశ్రా వెల్లడించారు.
Kite String Slits Throat: మాంజా కాదు మృత్యుపాశం.. చిన్నారితో పాటు మరొకరు మృతి
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. రాజశ్రీ కుటుంబసభ్యులు ఆమెను హత్య చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, కళ్లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే.. దట్టమైన అడవికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్న పాయింట్ని లేవనెత్తుతున్నారు. ఎవరో కుట్ర పన్ని రాజశ్రీని హతమార్చారని పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు. కాగా.. రాజశ్రీ స్వైన్ ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన క్రికెటర్. పుదుచ్చేరిలో జరిగే క్రికెట్ టోర్నీ కోసం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు కటక్ వచ్చింది. అయితే.. 16 మందితో కూడిన జట్టులో మాత్రం ఆమె స్థానం సంపాదించుకోలేకపోయింది. జట్టులో తన పేరు లేకపోవడంతో.. రాజశ్రీ భోరున విలపించిందని ఆమె రూమ్మేట్ వెల్లడించింది. ఆ తర్వాత ఆమె హోటల్ గదికి రాలేదని తెలిపింది. రాజశ్రీ అదృశ్యంపై కోచ్ పుష్పాంజలి బెనర్జీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!