Kite String Slits Throat: మాంజా కాదు మృత్యుపాశం.. చిన్నారితో పాటు మరొకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kite String Slits Throat: చైనా మాంజా అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. సామాన్య జనంపై పంజా విసురుతూ బ్లాక్ మార్కెట్ నగరంలో అమ్ముడువున్న మాంజా.. కైట్ లవర్స్కు మజా తెస్తున్నప్పటికీ.. మనుషుల ప్రాణాలు తీస్తోంది. పతంగులను ఎగురవేసే సమయంలో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడానికి చైనా మాంజాను వాడుతున్నారు. ప్లాస్టిక్ దారానికి గాజుపొడి అద్ది ఈ మాంజాను తయారు చేస్తారు. దీనివల్ల గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో దారం మనుషుల పీకలకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరాయణ వేడుకల మధ్య గుజరాత్లోని వివిధ నగరాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో మూడేళ్ల బాలికతో పాటు 35 ఏళ్ల వ్యక్తి గొంతును మాంజా కోయడంతో వారిద్దరు మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
మెహ్సానా జిల్లాలోని విస్నగర్ పట్టణంలో మధ్యాహ్నం తన తల్లితో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కృష్ణ ఠాకూర్ (3) మెడను కోయడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులతో పాటు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో సంఘటనలో, వడోదరా నగరంలోని ఛని ప్రాంతంలో మోటార్సైకిల్పై వెళుతుండగా స్వామీజీ యాదవ్ మెడను గాలిపటం మాంజా కోయడంతో మరణించాడు. యాదవ్ తన ద్విచక్ర వాహనంపై వంతెనపైకి వస్తుండగా, గాలిపటం తీగ అతని గొంతును కోయడంతో, అతను తక్షణమే చనిపోయాడని ఛని పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు
ఇదిలావుండగా, గుజరాత్లో రోజంతా గాలిపటాల తీగలతో గాయపడిన అనేక కేసులు నమోదయ్యాయని 108 ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (ఇఎంఎస్) వ్యవస్థ అధికారులు తెలిపారు. గాలిపటాల తీగల వల్ల జరిగిన వేర్వేరు ఘటనల్లో కొందరు వాహనాలపై నుంచి కిందపడిపోయారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు టెర్రస్ల నుండి పడి గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన డేటా ప్రకారం.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 62 మంది వ్యక్తులకు మాంజా వల్ల గాయాలు కాగా, 164 మంది ఎత్తు నుంచి పడి గాయపడ్డారు. దీంతో పాటు 400 మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు. ఈ గణాంకాలలో అహ్మదాబాద్లో 25 గాలిపటాల గాయాలు, 56 రోడ్డు ప్రమాదాలు, 36 కేసుల్లో ఎత్తు నుంచి పడిపోవడం వల్ల గాయాలు సంభవించాయి. ఈ మాంజా కారణంగా అనేక పక్షులు, జంతువులు కూడా గాయపడ్డాయి.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!