Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎన్ఎస్ఈ, ఎల్ఐసీ బాసట.. పరహారం ప్రకటన
- పహల్గామ్ మృతుల కుటుంబాలకు ఎన్ఎస్ఈ, ఎల్ఐసీ బాసట
- ఎన్ఎస్ఈ రూ.1కోటి పరహారం ప్రకటన
- వెంటనే క్లెయిమ్ పూర్తి చేస్తామని ఎల్ఐసీ ప్రకటన
పహల్గామ్ మృతుల కుటుంబాలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సంఘీభావం తెలిపింది. దు:ఖ సమయంలో బాధితులకు అండగా నిలిచింది. ఉగ్రదాడి బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించింది. ఎన్ఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 26 మంది చనిపోవడం చాలా బాధ కలిగించిందని.. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు తమ వంతుగా రూ.1 కోటి సాయం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారి క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగవంతంగా పూర్తి చేస్తామని ప్రకటించింది. సకాలంలో కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా సహకరిస్తామని వెల్లడించింది. కేవలం పహల్గామ్ ఉగ్ర దాడి పత్రాన్ని తీసుకొస్తే చాలు.. వెంటనే క్లెయిమ్ పూర్తి చేస్తామని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతి స్పష్టం చేశారు.
Also Read
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: పహల్గామ్పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం.. తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా
We are deeply saddened by the tragic terrorist attack in Kashmir on April 22,2025 where 26 people lost their lives. In a humble gesture of support, NSE pledges Rs 1 crore to the next of kin of the victims, standing in solidarity with their families during this difficult time.…
— Ashish Chauhan (@ashishchauhan) April 24, 2025
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!