Devendra Fadnavis: ఛత్రపతి మాకు స్పూర్తి, పారిపోయే ప్రసక్తే లేదు.. రాజీనామాపై వెనక్కి తగ్గిన ఫడ్నవీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ దారుణ ప్రదర్శనకు తాను బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల చెప్పారు. అయితే, అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనాయకత్వం వారించడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తాను పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాలని అమిత్ షా కోరిన ఒక రోజు తర్వాత ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో బీజేపీ 23 గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో కేవలం 09 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘నేను అందరి ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నాను, ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ పేరు మార్మోగుతోంది, నిన్న, NDA ప్రధానమంత్రిగా ఆయన పేరును అంగీకరించింది, ఈ సారి మహారాష్ట్రలో మేము కోరుకున్నన్ని సీట్లు పొందలేదు. భవిష్యత్ వ్యూహాలను రూపొందిస్తున్నాము’’ అని ఆయన అన్నారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: Canada: ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. ఖలిస్తానీల దురాగతం..
రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గత కారణాలను వివరిస్తూ ఫడ్నవీస్ ‘‘ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నేను నాయకత్వం వహించాను, కాబట్టి ఈ ఓటమికి నేనే బాధ్యత వహించాను. నా పదవికి రాజీనామా చేయడానికి అనుమతించాలని కోరాను. దీని వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో అట్టడుగు స్థాయిలో పనిచేయవచ్చని అనుకున్నాను. అయితే అగ్రనాయకత్వం తనపై నమ్మకం ఉంచింది. నాకు ఓ వ్యూహం ఉంది. తాను పారిపోయే వాడిని కాదు. కొందరు తాను నిరాశ చెందానని అనుకున్నారు. మనకు ఛత్రపతి శివాజీ స్పూర్తి. నేను ఎలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోను. నా మెదడులో ఓ వ్యూహం ఉంది’’ అని అన్నారు.
మహారాష్ట్ర లోక్సభ ఫలితాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 48 స్థానాల్లో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దశ్ శివసేన 30 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక బీజేపీ కూటమిలోని బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, షిండే శివసేన కలిసి 17 సీట్లను గెలుచుకున్నాయి. అయితే, ప్రతిపక్ష కూటమి తమ కన్నా 2 లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పొందాయని, కానీ సీట్లు భారీగా కోల్పోయామని అన్నారు. దళితులు, గిరిజనులను మభ్యపెట్టేలా కాంగ్రెస్ కూటమి ఓ కథనాన్ని రూపొందించిందని, వచ్చే ఎన్నికల్లో అది నడవదని చెప్పారు.
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?