Nora Fatehi: 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నోరా ఫతేహిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi: జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహి గురువారం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ముందు హాజరయ్యారు. నోరా ఫతేహీ ఇవాళ ఉదయమే మందిర్ మార్గ్లోని ఢిల్లీ పోలీస్ ఈఓడబ్ల్యూ కార్యాలయానికి వచ్చారు. ఇదే కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారించిన ఒక రోజు అనంతరం నోరా ఫతేహీ విచారిస్తున్నారు.
అంతకుముందు సెప్టెంబర్ 2న నోరా ఫతేహిని అధికారులు తొమ్మిది గంటలకు పైగా విచారించారు. దాదాపు 50 ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో నోరా ఫతేహి దర్యాప్తుకు సహకరించారని.. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని అధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు అందుకున్న వ్యక్తులకు నేరంలో ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని ఆయన వెల్లడించారు.
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోని విడుదల చేసిన బీజేపీ
గతంలో విచారణకు హాజరైన ఫతేహీ.. బహుమతులు తీసుకున్నానని, కానీ అతనికి నేర సంబంధాలు ఉన్నాయని తనకు తెలియదని అధికారులకు తెలిపింది. సుఖేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్న నోరా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు ఒకరికొకరు బహుమతులు అందుకుంటున్న విషయం తెలియదని ఇప్పటివరకు ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్ 2021లో ఈడీ ఫతేహి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది, అక్కడ ఆరోపించిన నేరస్థుడు, అతని నటుడు భార్య లీనా నుండి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించింది.
మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానంటూ… అతని భార్య నుంచి 215 కోట్ల రూపాయలు బురిడీ కొట్టించాడు. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్నూ ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్… 10 కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు పంపినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని… గతంలో ఆరు గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!