INDIA MPs: మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయండి.. రాష్ట్రపతికి ఇండియా ఎంపీల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA MPs: మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ప్రతిపక్ష కూటమి ఇండియా ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్ అంశంపై రాష్ట్రపతికి వివరించడానికి సమయం కోరగా ఈ రోజు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా గత మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సూచించారు. ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.మణిపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్రపతిని ఎంపీలు కోరారు.
Read also; KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిసిన సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) సభ్యురాలు సుస్మితా దేవ్ మణిపూర్ మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని అభ్యర్థించారు. అలాగే మణిపూర్ ఘటనలపై పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రధాని మోడీని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు. ‘‘మణిపూర్లో వేర్వేరు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి సూచించాం. ఈ చర్య రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు ఉపయోగకరంగా ఉంటుందని సుస్మితా దేవ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీయూ నాయకుడు రాజీవ్ రంజన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) నాయకులు అర్వింద్ సావంత్, సంజయ్ రౌత్, టీఎంసీ నాయకులు సుదీప్ బంధోపాధ్యాయ, డెరెక్ ఒబ్రెయిన్లు ఉన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!