Noida Twin Towers: 40 అంతస్తులు 35 క్వింటాళ్ల పేలుడు పదార్థాలు.. భవనం కూల్చేందుకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida Towers Will Be Demolished..using 3,500 kg Explosives: నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేతకు రంగం సిద్ధం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తేలడంతో.. ఏకంగా సుప్రీంకోర్టు కూల్చేవేతకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 28న మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా సూపర్ టెక్ లోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయనున్నారు. ఇప్పటికే అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు. కూల్చివేత సమయంలో స్థానికులు దూరంగా ఉండాలని కోరారు.
దాదాపుగా 100 మీటర్ల ఎతైన నోయిడా ట్విన్ టవర్స్ భవనం కూల్చివేత ఈ నెల 21నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మరింత గడువు కావాలని నోయిడా అథారిటీ చేసిన అభ్యర్థనతో కూల్చివేతను ఆగస్టు 28కి మార్చింది. ఈ జంట టవర్లలో మొత్తం 900 ఫ్లాట్లు, 21పైగా దుకాణాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ 40 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు ఏకంగా 3500 కిలోల( 35 క్వింటాళ్ల) పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. భవనంలోని పిల్లర్లకు 9400 రంధ్రాలను చేసి వాటిలో పేలుడు పదార్థాలు నింపి భవనాన్ని కూల్చివేయనున్నారు. ఇప్పటికే ఈ భవనం వద్దకు పేలుడు సామాగ్రితో పాటు ఇతర సామాగ్రిని చేర్చుతున్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: Dj Tillu 2: టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట..?
సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ నివాసితులను ఆగస్టు 28 ఉదయం 7 గంటల్లోపు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సాయంత్రం 4 గంటల తర్వాతే రావాలని అధికారులు స్థానికులకు తెలిపారు. యూకే నుంచి ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. ఈ పేలుడు వల్ల 50 మీటర్ల వ్యాస్తార్థం వరకు ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కూల్చివేత సమయంలో స్థానికంగా ఉన్న రెండు సొసైటీల నుంచి ఎలాంటి వాహనాలను ఈ ప్రాంతంలోని అనుమతించమని తెలిపారు అధికారులు. ఈ భవనం కూల్చివేత కోసం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేను ఆగస్టు 28న మధ్యాహ్నం 2:15 నుండి 2.45 గంటల వరకు వాహనాల రాకపోకలకు నిలిపివేయనున్నారు. కూల్చివేత సంస్థ ఎడిఫైస్ ఇంజినీరింగ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ కూల్చివేతపై చర్చించాయి. కూల్చివేత ప్రాంతానికి కూతవేటు దూరంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను నిలిపి ఉంచడానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!