Masala Dosa: స్పెషల్ మసాలా దోశకు సాంబార్ ఇవ్వని రెస్టారెంట్.. రూ.3,500 జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masala Dosa: రెస్టారెంట్ల నిర్లక్ష్యం ఒక్కోసారి భారీ మూల్యానికి కూడా దారి తీయవచ్చు. బీహార్ లోని బక్సర్ కి చెందిన ఓ రెస్టారెంట్ స్పెషల్ మసాలా దోశకు సాంబార్ ఇవ్వనుందకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లాయర్ మనీష్ గుప్తా గత ఆగస్టులో తన పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక రెస్టారెంట్ నుంచి రూ.140 విలువైన మసాలా దోశను ఆర్డర్ చేశాడు. అయితే దోశతో పాటు సాంబార్ ఇవ్వలేదు సదరు రెస్టారెంట్.
దీంతో కస్టమర్ రెస్టారెంట్ ను ఏకంగా కోర్టుకు లాగాడు. కోర్టు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించింది. పిటిషనర్కు సాంబార్ నిరాకరించడం వల్ల కలిగే మానసిక, ఆర్థిక, శారీరక బాధను కోర్టు గుర్తించింది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్కు 45 రోజుల గడువు ఇచ్చింది. రెస్టారెంట్ అలా చేయడంలో విఫలమైతే, జరిమానా మొత్తంపై 8 శాతం వడ్డీ వసూలు చేయబడుతుందని తీర్పు చెప్పింది.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Hand Chopping Case: కేరళ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు..
2022, ఆగస్టు 15న న్యాయవాది మనీష్ గుప్తా తన పుట్టినరోజున మసాలా దోశ ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకుని, బక్సర్ లోని నమక్ రెస్టారెంట్ కి వెళ్లాడు. రూ. 140 తో స్పెషల్ మసాలా దోశ ఆర్డర్ చేశాడు. అయితే సాధారణంగా దోశను సాంబార్, చట్నీతో ఇస్తారు. కానీ మనీష్ ఆర్డర్ లో సాంబార్ రాలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే, రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది.‘‘రూ.140తో రెస్టారెంట్ మొత్తాన్ని కొంటారా..?’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
మనీష్ రెస్టారెంట్కు లీగల్ నోటీసును అందించాడు. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. 11 నెలల తర్వాత, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ వేద్ ప్రకాష్ సింగ్ మరియు సభ్యుడు వరుణ్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ రెస్టారెంట్ను దోషిగా నిర్ధారించి, రూ. 3,500 జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!