Hand Chopping Case: కేరళ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hand Chopping Case: 2010లో కేరళలో ఓ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఈ రోజు ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సంచలనాత్మకమైన ఈ కేసులో నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్న ఆరుగురిలో ముగ్గురికి కేరళలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.
చట్టవిరుద్ధమైన కార్యకలాపాల(నిషేధిత చట్టం)(UAPA), ఇండియన్ పీనల్ కోడ్, పేలుడు పదార్థాల చట్టం కింద నేరాలకు పాల్పడిన సజిల్, నజీబ్, నాసర్ లకు న్యాయమూర్తి అనిల్ కే భాస్కర్ శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. వీరికి ఆశ్రయం కల్పించడంతో పాటు నేరం గురించి ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వనందుకు నౌషద్, మెయిదీన్ కున్హు, అయూబ్ లకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
Read Also: PM Modi: ఫ్రాన్స్లో ప్రధాని మోడీకి రెడ్ కార్పెట్ వెల్కమ్..
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సవాద్ ఇప్పటికి పరారీలోనే ఉన్నాడు. ఈ ఘటనలో పోలీసులు 11 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈరోజు కోర్టు శిక్ష విధించింది. వీరిలో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పు చెప్పింది. మరో 5 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఈ దాడితో తాను కొంతకాలం పాటు ఉద్యోగానికి దూరమయ్యానని, ఆ సమయంలో తన భార్య ఆత్మహత్య చేసుకుందని జోసెఫ్ తెలిపారు.
సంచలనం సృష్టించిన కేసు:
జూలై4, 2010న ఇడుక్కి జిల్లాలో తోడుపుజాలోని న్యూమాన్ కాలేజీ ప్రొఫెసర్ గా ఉన్న టీజే జోసెఫ్ కుడి చేతిని పీఎఫ్ఐ కార్యకర్తలు నరికేశారు. ఎర్నాకులం జిల్లాలోని మువట్టుపుజాలోని చర్చిలో ఆదివారం ప్రార్థనలు ముగించుకుని కుటుంబంతో ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది. వాహనం నుంచి బయటకు లాగే, అతని కుడి చేతిని నరికేశారు. మొత్తం ఏడుగురు ఈ దాడిలో పాల్గొన్నారు. బీకామ్ సెమిస్టర్ పరీక్షల కోసం ప్రశ్నా పత్రాన్ని రూపొందించిన జోసెఫ్, ఓ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై పీఎఫ్ఐ వ్యక్తులు దాడి చేశారు.
తాజావార్తలు
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!