Masala Dosa: రెస్టారెంట్ల నిర్లక్ష్యం ఒక్కోసారి భారీ మూల్యానికి కూడా దారి తీయవచ్చు. బీహార్ లోని బక్సర్ కి చెందిన ఓ రెస్టారెంట్ స్పెషల్ మసాలా దోశకు సాంబార్ ఇవ్వనుందకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లాయర్ మనీష్ గుప్తా గత ఆగస్టులో తన పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక రెస్టారెంట్ నుంచి రూ.140 విలువైన మసాలా దోశను ఆర్డర్ చేశాడు. అయితే దోశతో పాటు సాంబార్ ఇవ్వలేదు సదరు రెస్టారెంట్.