No Pension: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఇకపై పెన్షన్ కట్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం
- ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్
- అసెంబ్లీలో హిమాచల్ప్రభుత్వం కొత్త బిల్లు ఆమోదం
- బిల్లు ఆమోదంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ప్రభుత్వం అసెంబ్లీలో సరికొత్త బిల్లును ఆమోదించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వకూడదని శాసనసభలో ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. బుధవారం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లైంది. బిల్లు ఆమోదంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పింఛన్ అందదు.

Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రాజ్యసభ ఎన్నికల సమయంలో హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి సునాయసంగా గెలుపొందాడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రాజ్యసభ సీటును కోల్పోవల్సి వచ్చింది. ఈ పరిణామం కాంగ్రెస్కు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్.. బుధవారం అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భవిష్యత్లో పింఛన్ ఇవ్వకూడదని బిల్లు ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. బిల్లు ఆమోదంతో ఇకపై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ అందదు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బాలుడిపై లైంగిక వేధింపులు.. స్థానికుల ఆందోళనతో ఉద్రిక్తత
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన కొత్త బిల్లు ప్రకారం ఇతర పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ ఉండదు. ఫిరాయింపుదారులకు పెన్షన్ నిలిపివేసేలా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో కొత్త బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పింఛను నిలిపివేసే బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం బుధవారం బిల్లు ఆమోదం పొందింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుంది. సభ్యుల భత్యాలు మరియు పెన్షన్ సవరణ బిల్లు 2024 పేరుతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.
‘‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా అనర్హులుగా ఉన్నట్లయితే, చట్టం ప్రకారం ఒక వ్యక్తి పెన్షన్కు అర్హులు కాదు’’ అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రస్తావిస్తూ బిల్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: IC-814 Plane Hijack: భారతీయ మహిళకు శాలువాపై పుట్టినరోజు శుభాకాంక్షలు రాసిచ్చిన ఉగ్రవాది!.. అది ఇంకా ఆమెతోనే ఉంది
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!