హిమాచల్ప్రభుత్వం అసెంబ్లీలో సరికొత్త బిల్లును ఆమోదించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వకూడదని శాసనసభలో ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. బుధవారం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లైంది. బిల్లు ఆమోదంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పింఛన్ అందదు.
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లిపోయారు. వారందరూ బీజేపీతో టచ్ లో ఉన్నట్లు టాక్.