NDA Splits Over Jumma Break: జుమ్మా బ్రేక్పై ఎన్డీయేలో చీలికలు.. ప్రభుత్వంపై జేడీయూ ఫైర్..!
- జుమ్మా బ్రేక్ నిర్ణయంపై అస్సాం ఎన్డీయే కూటమిలో విభేదాలు..
- పేదరికం.. వరదలపై సీఎం హిమంత బిస్వా శర్మ దృష్టి పెడితే బాగుండేది..
- మత విశ్వాసాలపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదు: జేడీయూ నేత నీరజ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA Splits Over Jumma Break: అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ప్రతి మత విశ్వాసానికి దాని సంప్రదాయాలను కాపాడుకునే హక్కులను కాలే రాసే విధంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో జుమ్మా ప్రార్థనల కోసం 2 గంటల వాయిదా పద్ధతిని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) నాయకుడు నీరజ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. మత విశ్వాసాలపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. పేదరికం నుంచి పైకి లేవడంపై అస్సాం సీఎం మరింత దృష్టి పెడితే బాగుంటుందని ఆయన అన్నారు. రంజాన్ సందర్భంగా శుక్రవారం సెలవులపై నిషేధం విధిస్తున్నారు.. కానీ హిందూ సంప్రదాయంలో మా కామాఖ్య దేవాలయం దగ్గర కొనసాగుతున్న బలి ఆచారంపై నిషేధం విధించగలరా? అని నీరజ్ కుమార్ ప్రశ్నించారు.
Read Also: Women’s Waist : పెళ్లి తర్వాత ఆడవాళ్ల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
కాగా, మత విశ్వాసాలపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదు.. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న ప్రజలను పైకి తీసుకురావడంతో పాటు అస్సాం వరదలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చూసుకోవడంపై మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తే బాగుండేది అని జేడీయూ నేత నీరజ్ కుమార్ అన్నారు. అస్సాంలో సాదులా యొక్క ముస్లిం లీగ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి శుక్రవారం జుమ్మా ప్రార్థనల కోసం రెండు గంటల వాయిదా పద్ధతిని సీఎం హిమంత్ బిస్వాశర్మ నిలిపి వేయడం దారుణమన్నారు.
Read Also: Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..
కాగా, ఈ నిర్ణయంపై సీఎం హిమంత బిస్వాశర్మ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం ఎమ్మెల్యేలు రూల్ కమిటీలో కూర్చుని రెండు గంటల విరామం సరికాదని ఏకగ్రీవంగా తీర్మానించారని చెప్పారు. 1937లో ప్రారంభమైన ఈ ఆచారం నిన్నటి నుంచి ఆగిపోయింది అన్నారు. గత నిబంధనల ప్రకారం ముస్లిం సభ్యులు నమాజ్కు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ వాయిదా పడింది.. అయితే కొత్త నిబంధన ప్రకారం మతపరమైన ప్రయోజనాల కోసం ఎలాంటి వాయిదా లేకుండా సభ కార్యకలాపాలు అస్సాం సర్కార్ నిర్వహిస్తుంది. సవరించిన నియమం ప్రకారం, అస్సాం అసెంబ్లీ శుక్రవారాలతో సహా ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. మత ప్రాతిపదికన సమాజాన్ని విభజించే లక్ష్యంతో ఉన్న వలసవాద ఆచారాన్ని రద్దు చేసేందుకు ఈ సవరణ చేసినట్లు ఉత్తర్వుల్లో అస్సాం సర్కార్ పేర్కొంది.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!