రెండు డోసుల మధ్య గ్యాప్పై కేంద్రం క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేవశ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం రోజురోజుకూ వేగం పుంజుకుంటుంది.. అయితే, కరోనా ఫస్ట్ డోస్.. సెకండ్ డోస్కు మధ్య ఉండాల్సిన గ్యాప్పై రకరకాల కథనాలు వస్తున్నాయి.. వైద్య నిపుణులకు కూడా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి.. ఈ సమయంలో.. కొందరికి ఆందోళనకు కూడా కలుగుతోంది.. దీంతో.. కరోనా డోసుల మధ్య నిడివి గురించి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. రెండు డోసుల మధ్య గ్యాప్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించిన కేంద్రం.. నిడివి తగ్గింపు కోసం ముందుగా భారత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఓ అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపింది.. ఇప్పటికిప్పుడు రెండు డోసుల మధ్య నిడివిని తగ్గించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన కేంద్రం.. ఇవన్నీ ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయాలు. రెండు డోసుల మధ్య సమయాన్ని పెంచినప్పుడు మేం ఒకే డోసు తీసుకున్న వారు ఎదుర్కోబోయే ప్రమాదాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మందికి ఫస్ట్ డోస్ లభించిందన్నారు నీతీ అయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్.. దీంతో వైరస్ నుంచి కొంతమంది రక్షణ పొందగలిగారని.. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం సమతుల్యం సాధించాలని.. ఈ విషయాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిందే అన్నారు.. ఇక, ఈ విషయంలో నిపుణులు తగిన వేదికల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు వీకే పాల్..
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!