Amit Shah: రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండదు.. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు.
Read Also: Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
మా కూటమి పెరగాలని మేము ఎప్పుడు కోరుకుంటామని, కొత్త మిత్రులను ఎల్లప్పుడూ స్వాతిస్తామని, జన సంఘ్ నుంచి మా భావజాలంలో అలాగే ఉందని, మాతో చేరే వారు రావచ్చని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పారు. అకాళీదళ్ రీఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ ఖరారు కాలేదని అన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న ఎస్ఏడీ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా 2020లో ఎన్డీయే నుంచి వైదొలిగింది. 2018లో ఎన్డీయే నుంచి వైదొలిగిన తెలుగుదేశం(టీడీపీ) లేదా వైఎస్ఆర్సీపీతో చేతులు కలిపే విషయంపై మాట్లాడుతూ.. కొంత కాలం తర్వాత అంతా తేలిపోతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి మరింత బలపడేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ కూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేతో జతకట్టారు. ఆర్ఎల్డీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది.
బీజేపీ కూటమి నుంచి ఏ భాగస్వామి విడిపోవాలని ఎన్నడూ కోరుకోలేదని, రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలకే అవకాశం ఇచ్చామని అమిత్ షా అన్నారు. ఎన్డీయే నుంచి కొందరు వెళ్లిపోగా.. కొత్త వారు వచ్చారని, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, కొన్ని సంఘటనల వల్ల కొన్ని పార్టీలు వెళ్లిపోయాయని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని కొనసాగించిందని చెప్పారు.
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?