Amit Shah: రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండదు.. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు..
Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు.
Read Also: Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్
Also Read
- Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
మా కూటమి పెరగాలని మేము ఎప్పుడు కోరుకుంటామని, కొత్త మిత్రులను ఎల్లప్పుడూ స్వాతిస్తామని, జన సంఘ్ నుంచి మా భావజాలంలో అలాగే ఉందని, మాతో చేరే వారు రావచ్చని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పారు. అకాళీదళ్ రీఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ ఖరారు కాలేదని అన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న ఎస్ఏడీ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా 2020లో ఎన్డీయే నుంచి వైదొలిగింది. 2018లో ఎన్డీయే నుంచి వైదొలిగిన తెలుగుదేశం(టీడీపీ) లేదా వైఎస్ఆర్సీపీతో చేతులు కలిపే విషయంపై మాట్లాడుతూ.. కొంత కాలం తర్వాత అంతా తేలిపోతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి మరింత బలపడేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ కూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేతో జతకట్టారు. ఆర్ఎల్డీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది.
బీజేపీ కూటమి నుంచి ఏ భాగస్వామి విడిపోవాలని ఎన్నడూ కోరుకోలేదని, రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలకే అవకాశం ఇచ్చామని అమిత్ షా అన్నారు. ఎన్డీయే నుంచి కొందరు వెళ్లిపోగా.. కొత్త వారు వచ్చారని, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, కొన్ని సంఘటనల వల్ల కొన్ని పార్టీలు వెళ్లిపోయాయని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని కొనసాగించిందని చెప్పారు.
తాజావార్తలు
-
Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!