Amit Shah: రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండదు.. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు.
Read Also: Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
మా కూటమి పెరగాలని మేము ఎప్పుడు కోరుకుంటామని, కొత్త మిత్రులను ఎల్లప్పుడూ స్వాతిస్తామని, జన సంఘ్ నుంచి మా భావజాలంలో అలాగే ఉందని, మాతో చేరే వారు రావచ్చని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పారు. అకాళీదళ్ రీఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ ఖరారు కాలేదని అన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న ఎస్ఏడీ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా 2020లో ఎన్డీయే నుంచి వైదొలిగింది. 2018లో ఎన్డీయే నుంచి వైదొలిగిన తెలుగుదేశం(టీడీపీ) లేదా వైఎస్ఆర్సీపీతో చేతులు కలిపే విషయంపై మాట్లాడుతూ.. కొంత కాలం తర్వాత అంతా తేలిపోతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి మరింత బలపడేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ కూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేతో జతకట్టారు. ఆర్ఎల్డీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది.
బీజేపీ కూటమి నుంచి ఏ భాగస్వామి విడిపోవాలని ఎన్నడూ కోరుకోలేదని, రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలకే అవకాశం ఇచ్చామని అమిత్ షా అన్నారు. ఎన్డీయే నుంచి కొందరు వెళ్లిపోగా.. కొత్త వారు వచ్చారని, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, కొన్ని సంఘటనల వల్ల కొన్ని పార్టీలు వెళ్లిపోయాయని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని కొనసాగించిందని చెప్పారు.
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!