కేంద్ర కేబినెట్లోకి జేడీ-యూ.. నాలుగు మంత్రి పదవులు..?
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది… రేపు సాయంత్రం 6 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది.. ప్రధానంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఈ సారి కేబినెట్లో చోటు దక్కనుంది… ఇక, ఇప్పటికే బీహార్లో కలిసి పనిచేస్తున్నాయి బీజేపీ-జేడీయూ.. ఇప్పుడు కేంద్ర కేబినెట్లోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్? అయితే, తమకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.. ఈ అంశం పై జనతా దళ్-యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు ఆర్.సి.పి. సింగ్కు పూర్తి బాధ్యతలు అప్పగించారు నితీష్… అన్ని అంశాలు, బీజేపీతో మాట్లాడిన సింగ్.. తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గంలో నాలుగు మంత్రి పదవులు కావాలని కోరుతున్నజేడీయూ.. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని చెబుతోంది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు సీట్లు దక్కినా.. ఆ పార్టీ అధినేత అయినటువంటి నితీష్ కుమార్నే సీఎంను చేశారు ప్రధాని మోడీ. మరి.. ఇప్పుడు కేంద్ర కేబినెట్లో ఎన్ని బర్త్లు దక్కుతాయే చూడాలి.
Also Read
తాజావార్తలు
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
-
USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
-
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!