Nirmala Sitaraman: కేసీఆర్పై నిర్మలా ఫైర్.. జోకులు వద్దంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitaraman Fires On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్కి తెలియదని ఎద్దేవా చేశారు. ‘అమృతకాల బడ్జెట్’ అంశంపై హైదరాబాద్లో దూరదర్శన్ న్యూస్ ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరాలన్న లక్ష్యంపై జోక్లు వేయొద్దని సీరియస్ అయ్యారు. 2014లో తెలంగాణకు రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. తమపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నెంబర్లు చూసి విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
Nitish Kumar: నాకు ప్రధాని కావాలనే కోరిక లేదు..
Also Read
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
- Abhijeet Dipke: సోనమ్ వాంగ్చుక్, కాంగ్రెస్పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిందని, దానినే తాము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లు అడిగినప్పుడు వాళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు బాధపడితే ఏం లాభమని నిర్మలా పేర్కొన్నారు. నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ ఎవరిదో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందన్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ.. మెడికల్ కాలేజీల కోసం అవే జిల్లాల పేర్లు మళ్లీ పంపించారని, అందుకే తిరస్కరించి పంపించానన్నారు. అయితే.. ఇప్పటికీ కొత్త జిల్లాల పేర్లు పంపించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన డేటా ఇవ్వలేదని చెప్పారు. 2014 నుండి ఇప్పటివరకు 157 మెడికల్ కాలేజీలు స్థాపించామన్నారు. ఆ కాలేజీల వద్దే నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఉపాధి హామీకి కేటాయించిన దానికన్నా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Chandrababu Naidu: రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు
కాగా.. 2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్కు చేరుతుందనడం పెద్దజోక్ అంటూ శాసనసభలో సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ అని, మోదీ బడాయిలు పోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 192 దేశాలుంటే.. అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్లో ఇండియాది 139వ స్థానమన్నారు. మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ ముందున్నాయని విమర్శించారు. 2024లో బీజేపీ కుప్పకూలడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశంలో అంతులేని ప్రైవేటీకరణ జరుగుతోందని.. రైల్వేలు, ఎయిర్పోర్టులతో పాటు ఎల్ఐసీని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని వాపోయారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!